ఇస్తే సులభం.. కుట్ర చేస్తే కష్టం
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం.
తొలిరోజు 1.13 లక్షల మందికి పింఛను సొమ్ము
సిబ్బందిని పూర్తిగా వినియోగిస్తే రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి
ఉరవకొండలోని సచివాలయం-4 వద్ద జాబితాలో పేర్లు వెతుకుతున్న పింఛనుదారులు
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు, మూడు రోజుల్లోనే ప్రక్రియను పూర్తిచేసేవారని వాదనకు బలం చేకూరింది. ఇంటింటికీ పంపిణీ చేసే వ్యవస్థ, సామర్థ్యం ఉన్నా.. జగన్ సర్కారు దొంగనాటకం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1.58 లక్షల మంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేవని తేల్చారు. వారందరికీ సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటిరోజు పింఛను అందించారు. తొలిరోజే 71 శాతం లక్ష్యాన్ని పూర్తిచేశారు. తక్కువ మంది సిబ్బందితో సొమ్ము ఇవ్వగలిగారు. ఈ లెక్కన అవకాశం ఇచ్చి ఉంటే మరో రెండు రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తిచేసేవారు. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసే సమయంలోనూ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చేవారు. ఈ లెక్కన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సాధ్యమే అని స్పష్టమవుతోంది.
సచివాలయాల వద్ద పడిగాపులు
పింఛను సొమ్ము ఎవరి ఖాతాలో వేస్తారు? ఎవరికి ఇంటివద్ద అందజేస్తారు అనే స్పష్టత అధికారులు ఇవ్వలేదు. దీంతో చాలామంది వృద్ధులు గతనెల మాదిరిగానే సచివాలయాల వద్దకు వెళ్లి ఎదురుచూశారు. తమకు బ్యాంకు ఖాతా ఉన్నట్లు తెలియదని కొందరు వృద్ధులు వాపోయారు. చాలాకాలంగా ఖాతా వాడటం లేదని.. కనీస సొమ్ము లేని కారణంగా సొమ్ము బ్యాంకు వారే జమ చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు చాలామంది వృద్ధుల పేరుతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు ఉన్నాయి. పింఛను సొమ్మును వడ్డీ కింద జమ చేసుకుంటారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు తెలియదని బదులిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన లబ్ధిదారులు
శెట్టూరు : తాము పింఛనుపైనే ఆధారపడి బతుకున్నాం.. నేరుగా చేతికందించాలని శెట్టూరుకు చెందిన పలువురు మహిళలు పంచాయతీ కార్యదర్శి వ్యాస్రావ్ను నిలదీశారు. బుధవారం ఉదయమే సచివాలయానికి చేరుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘బ్యాంకు ఖాతాలో పింఛను వేస్తే అప్పునకు జమ చేస్తారు. ఏం తినాలి. మేము పేదవాళ్లం. ఆరోగ్యాలు బాగాలేవు. మందులు కొనుగోలు చేయాలి. బ్యాంకుకు వెళ్లి నగదు డ్రా చేసుకొని తెచ్చుకోలేమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!