logo

తెదేపా ప్రచారంలో తప్పెట కొట్టాడని..

తెదేపా ఎన్నికల ప్రచారంలో తప్పెట కొట్టాడని ఓ దళితుడిని వైకాపా సర్పంచి మరిది చితకబాదాడు.

Published : 07 May 2024 05:09 IST

దళితుడిని చితకబాదిన వైకాపా సర్పంచి మరిది

రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతు

డి.హీరేహాళ్‌, న్యూస్‌టుడే: తెదేపా ఎన్నికల ప్రచారంలో తప్పెట కొట్టాడని ఓ దళితుడిని వైకాపా సర్పంచి మరిది చితకబాదాడు. ఈ ఘటన హీరేహాళ్‌ మండలంలో చోటు చేసుకుంది. హులికల్లు గ్రామంలో సోమవారం రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హనుమంతు తెదేపాకు మద్దతుగా తప్పెట కొట్టాడు. దీన్ని జీర్ణించుకోలేక కల్యం వైకాపా మద్దతుదారు సర్పంచి పుష్పవతి మరిది శివ, అదే గ్రామానికి చెందిన దేవరాజు హనుమంతుపై పిడిగుద్దులు కురిపించారు. గ్రామంలో ఎవరైనా తెదేపాకు తప్పెట కొడితే వారికీ ఇదే గతి పడుతుందని శివ హెచ్చరించాడు. తీవ్రంగా గాయపడిన హనుమంతును బంధువులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన ఇద్దరినీ విచారిస్తున్నట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధ్యులను శిక్షించాలని దళితులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని