‘సీఎం జగన్ ఓ పిచ్చోడు’
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు.
బాలకృష్ణకు హారతి ఇస్తున్న మహిళలు
హిందూపురం అర్బన్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కూడును లాగేసుకొన్నారని, సమీపంలోని తమిళనాడులో ప్రభుత్వం మారినా సీఎం స్టాలిన్ అమ్మ క్యాంటీన్ కొనసాగిస్తున్నారన్నారు. పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో సోమవారం బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో రోడ్షో నిర్వహించగా ప్రజలు నిరాజనం పట్టారు. అనంతరం వార్డుల ప్రధాన కూడళ్ల వద్ద మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసం కొనసాగిందని, ప్రజలు అభివృద్ధి కావాలో విధ్వంస పాలన కావాలో తేల్చుకోవాలన్నారు. రెండు దఫాలు తనను గెలిపించి ఆశీర్వదించారని ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉర్దూలో మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొన్నారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప, పట్టణ పార్టీ అధ్యక్షుడు డీఈ రమేశ్కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అనిల్కుమార్, పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడు శివశంకర్, రాష్ట్రమైనార్టీ నాయకుడు షఫీవుల్లా, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ చంద్రమోహన్యాదవ్, ఆయా వార్డుల నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు