అర్జున్ తెందూల్కర్ వీర విహారం..
యునైటెడ్ జట్టు విజయం
అర్జున్ తెందూల్కర్కు అవార్డు అందజేస్తున్న శిక్షకుడు వెంకటేశ్
అనంతపురం క్రీడలు, న్యూస్టుడే: అనంత క్రికెట్ లీగ్ పోటీల్లో అర్జున్ తెందూల్కర్ బ్యాటింగ్లో కదంతొక్కడంతో యునైటెడ్ ఛాంపియన్స్ క్రికెట్ క్లబ్ జట్టు 56 పరుగుల తేడాతో ఫ్యామిలి క్లబ్ జట్టును చిత్తుచేసింది. అనంత క్రీడా గ్రామంలో శనివారం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన యునైటెడ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగుల భారీ స్కోరు సాధించింది. అర్జున్ తెందూల్కర్ (85; 54 బంతుల్లో) స్వైర విహారం చేయడంతో జట్టు భారీస్కోరు నమోదు చేసింది. పి.మణిదీప్, కుళ్లాయప్పలు చెరో 25 పరుగులు చేసి అలరించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఫ్యామిలి క్లబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసి ఓడిపోయింది. అర్జున్ తెందూల్కర్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును క్రికెట్ శిక్షకుడు వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నాడు. మరో పోటీలో అనంత రైజింగ్ స్టార్ జట్టు దినేష్ గ్రానైట్స్ జట్టును 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దినేశ్ గ్రానైట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేయగా అనంత రైజింగ్ స్టార్ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగులు చేసి ప్లే ఆఫ్లో స్థానం సాధించింది. బ్యాటర్ వై.తేజారెడ్డి (63) ఒంటరిపోరు కొనసాగించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 4 వికెట్లు తీసిన బి.భార్గవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మ్యాక్స్ లైఫ్ ప్రతినిధి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. ఆదివారం క్వాలిఫైర్ జట్ల మధ్య పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధుసూదన్ తెలిపారు.
అవార్డు అందుకుంటున్న బి.భార్గవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠకు తెర లేచింది. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
నిఘా నీడలో తాడిపత్రి
[ 01-06-2024]
తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కౌంటింగ్ వేళ.. భద్రత కట్టుదిట్టం
[ 01-06-2024]
కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా జరిగేలా కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. -
మళ్లీ పింఛను ఇబ్బందులు తప్పవా?
[ 01-06-2024]
పింఛన్ లబ్ధిదారులకు జూన్లోనూ కష్టాలు తప్పేలా లేవు. రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం అయ్యాయి. -
వచ్చేది మా పార్టీయే.. తెదేపా కార్యకర్తలను చంపుతా
[ 01-06-2024]
మళ్లీ వచ్చేది మా పార్టీనే.. తెదేపా కార్యకర్తలను చంపుతా అంటూ ఓ వైకాపా కార్యకర్త మద్యం మత్తులో వేటకొడవలితో వీరంగం సృష్టించాడు. -
కబ్జాలు కనిపించవా..?
[ 01-06-2024]
మున్సిపల్ స్థలాల ఆక్రమణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. -
4 మార్కులు లెక్కించడం మరిచారు!
[ 01-06-2024]
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. అనంతపురం నగరానికి చెందిన విద్యార్థిని షేక్. -
దళిత మహిళ భూమి వైకాపా నాయకుడి పేరున మార్పు
[ 01-06-2024]
మండలంలోని పందిపర్తికి చెందిన పేద దళిత మహిళ గంగరత్న పేరుతో ఉన్న 3.81 ఎకరాల అసైన్డ్ భూమిని వైకాపా నాయకుడు సజ్జారెడ్డి పేరున ఎలా రికార్డులు మార్చారని తహసీల్దార్ అంజనాదేవిని దళిత నాయకులు నిలదీశారు. -
నిక్కచ్చిగా పనిచేస్తే ముచ్చెమటలెందుకు?
[ 01-06-2024]
ఐదేళ్లపాటు పోలీసులను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి.. ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. -
ఎరవేసి.. హతమార్చారు
[ 01-06-2024]
ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్కుమార్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. -
తొలి ఫలితం.. పుట్టపర్తి, మడకశిర
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. -
కుళాయిల్లో గరళం!
[ 01-06-2024]
జీవకోటికి జలమే ప్రాణాధారం. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగంలో నిర్లక్ష్యం ఆవహించింది. జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, ధర్మవరం పట్టణాలకు చిత్రావతి రిజర్వాయరు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదే
[ 01-06-2024]
రాష్ట్రలో రైతన్నల ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదేనని ధర్మవరం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే