సమస్యాత్మక కేంద్రాల్లోనూ..స్వేచ్ఛా పతాకం
రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లా ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు మంత్రులు, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీమంత్రి బరిలో నిలవడం.
ఈసీ ప్రత్యేక దృష్టి ఫలితం
పుంగనూరు: పోలింగ్ కేంద్రంలో ఓటర్లను విచారిస్తున్న ఎస్పీ
పుంగనూరు, న్యూస్టుడే: రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లా ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు మంత్రులు, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీమంత్రి బరిలో నిలవడం. మరోవైపు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా. ఆదినుంచి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలతో వైరివర్గం. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు సజావుగా జరగాలని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటువేయాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులకు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఫలితంగా ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో చెదురుమదురు సంఘటనలే తప్ప హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోల్చితే ఈ పర్యాయం 2.07శాతం పెరిగింది.
1309 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
జిల్లాలోని నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో 1771 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 415 సమస్యాత్మకం, తీవ్ర సమస్యాత్మకం పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సాధారణంగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోనే వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసేవారు. ఈ పర్యాయం 1309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం విశేషం. అలాగే రాష్ట్ర, పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిసి 2,936 మందిచే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పుంగనూరు, పలమనేరు, కుప్పంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉద్దండుల మధ్య పోటీ జరగనుండడం, వారికి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతోందని, ఏజెంట్లను సైతం కూర్చోపెట్టరనే ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లడంతో ఈసీ పటిష్ఠమైన చర్యలు చేపట్టింది.
పెరిగిన శాతం ఇలా..
సమస్యాత్మక, ఏకపక్ష గ్రామాల్లో పోలింగ్ శాతం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలోని యర్రాతివారిపల్లెలో 93.59 శాతం, దిన్నెపాటివారిపల్లెలో 94.04శాతం, మర్రిమాకులపల్లెలో 93.23శాతం, సుగాలిమిట్టలో 86.30 శాతం ఇలా జిల్లా వ్యాప్తంగా తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ శాతం పెరిగింది.
పోలింగ్ రోజున..
జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు, పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో కవరేజీ, వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కానీ సోమల మండలంలో ఆవులపల్లె, కందూరులో వైకాపా-తెదేపా నాయకుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. సదుం మండలం బూరగమందలో 14 మంది తెదేపా ఏజెంట్లను వైకాపా నాయకులు కిడ్నాప్ చేయడం జిల్లా ఎన్నికల అధికారి చొరవతో గంటల వ్యవధిలో విడిపించారు. యాదమరి మండలం 14కండ్రిగ ముస్లింవాడలో, రామకుప్పం మండలం ననియాలలో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య రగడ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తెదేపా అభ్యర్థి థామస్ల అన్నూరులో వాగ్వాదం, చిత్తూరు పట్టణం మిట్టూరులో మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
నియోజకవర్గాలు : నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
పోలింగ్ కేంద్రాలు : 1,771
వెబ్ కాస్టింగ్ : 1,309
బందోబస్తు : 2,936
బైండోవర్ : 4000
సమస్యాత్మకం, తీవ్ర సమస్యాత్మక పీఎస్లు: 415
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అవినీతి చూస్కో
[ 15-06-2024]
త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్గా మారింది. -
భూహక్కు.. సమస్యల చిక్కు
[ 15-06-2024]
చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు హర్షణీయం
[ 15-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
సగం పాఠశాలల్లో గుడ్డు పెట్టలేదు
[ 15-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు. -
అనధికార తట్టలు, హ్యాకర్ లైసెన్సులు
[ 15-06-2024]
తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది. -
అన్నదాత దరిచేరని విజ్ఞానం
[ 15-06-2024]
అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 15-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు -
పరిశ్రమించేందుకు మరో అవకాశం
[ 15-06-2024]
పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్-1 పనులు గడవు పెంచారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
[ 15-06-2024]
స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది.. -
గణనాథుడి సేవలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్
[ 15-06-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు. -
విలీనంతో సరిపెట్టారు
[ 15-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు. -
ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల అల్టిమేటం
[ 15-06-2024]
ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. -
సిరి సంత.. సేంద్రియం చెంత
[ 15-06-2024]
మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం -
ఎస్పీసీహెచ్లో గుండెమార్పిడి శస్త్రచికిత్స
[ 15-06-2024]
శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
-
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
-
వాళ్ల స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్ అశ్విన్
-
భారీ మెజార్టీతో గెలిపించారు.. నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో నారా లోకేశ్
-
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
-
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ఎలా ఉంది?