ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు,
పెనుమూరు: అభ్యర్థులు ప్రసాదరావు, థామస్ సమక్షంలో పార్టీలో చేరిన వైకాపా నాయకులు
పెనుమూరు: రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, రమణయ్యనాయుడు, రామకృష్ణమనాయుడు, డి.జగదీష్, సిద్దయ్యనాయుడు, ప్రసాద్నాయుడు, గొడుగుమానుపల్లెకు చెందిన సిద్ధయ్య.. తెదేపాలో చేరారు. రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి లోకనాథం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, జనసేన గౌరవాధ్యక్షుడు లోకనాథం పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: ప్రచారం చేస్తున్న జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు ప్రకాష్నాయుడు
చిత్తూరు(జిల్లా పంచాయతీ): ఎమ్మెల్యేగా తన భర్తకు అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అభ్యర్థి జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. 42వ డివిజన్లోని బజారువీధి, గాండ్లవీధి, వన్నియర్ బ్లాక్, గుర్రప్పనాయుడువీధి, డి.ఐ.రోడ్డు, జండామాను వీధిలో నాయకులు, తెలుగు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు రాణి, నగర అధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు శివకుమార్, జయకుమార్, నాగలక్ష్మి, సుధ, గిరిబాబు, పెరుమాళ్ పాల్గొన్నారు.
పెనుమూరు: తెదేపా అభ్యర్థి థామస్ను గెలిపించాలని కోరుతూ ఆయన తనయుడు రాహుల్.. కామచిన్నయ్య పల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నాయకులు తిరివిరెడ్డిపల్లె పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వి.హరిబాబు, మండల అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి లోకనాథం నాయుడు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, బీసీసెల్ అధ్యక్షుడు అశోక్, కలిగిరికొండ మాజీ ఛైర్మన్ ఈశ్వరప్రసాదు, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు అనూరాధ, పాల్గొన్నారు.
చిత్తూరు(జిల్లా పంచాయతీ): పూలు విక్రయించే మహిళతో మాట్లాడుతున్న ప్రతిమ
బంగారుపాళ్యం: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, మురళీమోహన్ను గెలిపించాలని తెదేపా శ్రేణులు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్నాయుడు, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్నాయుడు, క్లస్టర్ అధ్యక్షులు ధరణినాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు రాధిక, మండల తెదేపా కార్యదర్శి జనార్ధన్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు.
ఐరాల: చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు సతీమణి దగ్గుమళ్ల సుజాత తెలిపారు. దివిటివారిపల్లెలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గ్రామ మహిళలు పెద్దఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. ఆయా పార్టీల నాయకులు గిరిధర్బాబు, తులసీప్రసాద్, వేణుగోపాల్, ప్రశాంత్, సుధాకర్, లత, శాంతమ్మ పాల్గొన్నారు.
ఐరాల: దివిటివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ అభ్యర్థి ప్రసాద్రావు సతీమణి సుజాత
వెదురుకుప్పం: తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని అభ్యర్థి థామస్ అన్నారు. ఆయన తన భార్య శాంతిరెడ్డితో కలిసి మండలంలోని జక్కదొన పంచాయతీలో బాబు స్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఎగువకనికాపురం గ్రామానికి చెందిన వంద మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, గంటావారిపల్లె సర్పంచి శ్రీనాథరెడ్డి, నాయకులు మోహన్మురళి, కిషన్చంద్, బాబురెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బలి తీసుకునే పన్నాగం.. ఇంటింటా పంపిణీకి ఎగనామం
[ 01-05-2024]
తనలాంటి మానవతావాది, దయార్ద హృదయుడు లేడని మాటల్లో చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉన్నారు. పేదలకు పంపిణీ చేసే పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. -
రాజీనామా చేయాలంటూ వాలంటీర్లకు కౌన్సిలర్ బెదిరింపులు
[ 01-05-2024]
రాజీనామా చేయాలంటూ నలుగురు మహిళా వాలంటీర్లపై కౌన్సిలర్ ఒత్తిడి తీసుకురాగా.. వారు విబేధించారు. దీంతో అతను వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు చూసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. -
సకల జనులకు మేలు.. సూపర్ సిక్స్ పథకాలు
[ 01-05-2024]
సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఏన్డీయే కూటమి తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టో మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. -
ఆమె ఓటే శాసనం
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు.. పలమనేరు నియోజకవర్గంలో అధిక ఓటర్లు ఉండగా, నగరిలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. -
వైకాపా.. కుతంత్రాలకు పెట్టింది పేరు
[ 01-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు భంగపాటు తప్పదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. విపక్ష తెలుగుదేశానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
మడమ తిప్పి.. నిండా ముంచేసి
[ 01-05-2024]
జగనన్న మాటలకు.. చేష్టలకు ఆర్టీసీ ఉద్యోగులు నిండా మునిగారు.. ప్రభుత్వంలో విలీనం చేస్తామంటే అందరూ ఆశపడ్డారు.. తమ తలరాతలు మారాయని సంబరపడ్డారు.. తీరా ప్రభుత్వంలో చేరాక అక్కడి ఆదేశాలతో ఉద్యోగుల జీవితాలు చతికిల పడ్డాయి. -
వైకాపాకు ఓటేస్తే మీ భూములు కొట్టేస్తారు
[ 01-05-2024]
ప్రజలు వైకాపాకు ఓటేస్తే మీ భూములే కొట్టేస్తారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. బైరెడ్డిపల్లె మండలం ధర్మపురిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. -
బాలకృష్ణను కలిసిన తెదేపా నాయకులు
[ 01-05-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తూరు నుంచి ఒంగోలు పర్యటన నిమిత్తం మంగళవారం బయలుదేరి వెళ్లారు. -
బాధితులను పరామర్శించిన చల్లాబాబు
[ 01-05-2024]
చౌడేపల్లెలో జరిగిన దాడి సంఘటనలో సబ్జైల్లో ఉన్న తెదేపా మండల అధ్యక్షుడు రమేశ్రెడ్డి, మంజునాథరెడ్డి, మణికంఠ, సునీల్కుమార్, ఆదిశేషులను పుంగనూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు పరామర్శించారు. -
జగన్.. అవ్వాతాతలను ఏడి‘పింఛెన్’
[ 01-05-2024]
ప్రతి నెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వివిధ రకాల పింఛన్ల లబ్ధిదారులు ఈసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం అయిన వారికి మాత్రమే బ్యాంకుల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. -
రాజీనామా చేసి.. ప్రచారంలో తిరగాల్సిందే
[ 01-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ వాలంటీర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. రాజీనామా చేసి.. పార్టీ ప్రచారంలో భాగస్వాములు కావటంతో పాటు పోలింగ్ రోజున దగ్గరుండి ఓట్లు వేయించాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వాలంటీర్లకు హుకుం జారీ చేశారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా తాయిలాలు
[ 01-05-2024]
కుప్పం నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సోమ, మంగళవారాల్లో ఒక్కో వాలంటీరుకు రూ.5 వేల చొప్పున అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు