logo

మార్కెట్ యార్డు గేట్లు మూసివేసి రైతుల ఆందోళన

మదనపల్లెలో లారీ అసోసియేషన్, టమాటా వ్యాపారస్థులకు మధ్య వివాదం నెలకొంది.

Updated : 08 May 2024 13:13 IST

మదనపల్లె గ్రామీణం: మదనపల్లెలో లారీ అసోసియేషన్, టమాటా వ్యాపారస్థులకు మధ్య వివాదం నెలకొంది.  లారీ అసోసియేషన్ సభ్యులు మార్కెట్లోకి వచ్చిన అద్దె లారీలను తీసుకెళ్లారంటూ వ్యాపారస్థులు వేలాన్ని నిలిపివేశారు. దీంతో  రైతులు టమాటాలకు ధర తగ్గి నష్టపోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం  చేశారు. అనంతరం మార్కెట్ యార్డు ఎదుట రహదారిపై  టమాటాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.  లారీ అసోసియేషన్ సభ్యులను మార్కెట్లోకి అనుమతించకూడదని రైతుల డిమాండ్ చేస్తూ మార్కెట్ యార్డు గేట్లను మూసివేసి ఆందోళన చేశారు. దీనిపై మార్కెట్ అధికారులు రైతులు, వ్యాపారస్థులతో చర్చలు జరిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని