logo

కూటమిదే విజయం

రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయం అంటూ వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామాల్లో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు.

Published : 05 May 2024 19:17 IST

తాళ్లపూడి: రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయం అంటూ వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామాల్లో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. వేగేశ్వరపురంలో మాజీ మండల అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు, మాజీ ఎంపీపీ కోట్నీసు ఆధ్వర్యంలో సాగిన ఈ ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఉమ్మడిపార్టీల మేనిపెస్టో ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు బెనర్జీ, మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ, కె.రమణ, జనసేన నాయకులు అయితం మణికంఠ పాల్గొన్నారు. పెద్దేవంలో ద్విసభ్యకమిటీ సభ్యుడు సుబ్బారాయ చౌదరి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడిపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరావు తనయుడు ధరణ్ బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పార్టీల అభ్యరులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడపాటి కాశీ, గంగరాజు, కోడిశంకరం, పడమటి కృష్ణ, నామన చిన్నబూరయ్య, తిగిరిపల్లి గోపి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని