వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
బెంబేలెత్తుతున్న మిర్చి వ్యాపారులు
మిర్చియార్డు(గుంటూరు), న్యూస్టుడే: వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు. దివాళా తీసిన వారి నుంచి వసూళ్లు చేసి వ్యాపారులకు రావాల్సిన సొమ్ము ఇప్పించడం చేతగాని సంఘాల నాయకులు ఎన్నికల సందర్భంగా కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఓ శీతలగిడ్డంగిలో దిగుమతి సంఘ నాయకుల సమావేశం సోమవారం జరిగింది. ఓ మిర్చి వ్యాపారికి చెందిన సంస్థ నుంచి రావాల్సిన పద్దులు, వడ్డీల గురించి చర్చిద్దామని దిగుమతి సంఘం నేతల నుంచి వ్యాపారులకు కబురు అందింది. ఆమేరకు సదరు సంఘం పేరుపై కార్యదర్శి సంతకంతో ఆహ్వానం పంపారు. దీని ముసుగులో చందాలు వసూళ్లు చేస్తున్నారని తెలుసుకున్న అధిక శాతం మంది వ్యాపారులు ముఖం చాటేశారు. ఈ సమావేశానికి స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో మంగళవారం మిర్చియార్డు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అల్పాహార విందు ఉంటుందని కబురు పంపారు. మిర్చి వ్యాపారులు అందరికీ ఫోన్లు చేసి ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
పార్టీలతో సంబంధం ఏమిటని ప్రశ్నించడంతో..
ఇందులో తెదేపా, జనసేన, భాజపా అనుకూల వ్యాపారులు సదరు మిర్చి దిగుమతి సంఘం నాయకుల్ని నిలదీశారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఏమిటని ప్రశ్నించడంతో నేతలు ఖంగుతిన్నారు. ఇచ్చే చందాలేవో అన్ని పార్టీల అభ్యర్థులకు సమానంగా ఇద్దామని చెప్పడంతో సదరు సంఘ నేత మారు మాట్లడకుండా మిన్నకుండిపోయారు. మిర్చి ఎగుమతి సంఘాల నాయకులు మాత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూళ్లు చేసినట్లు సమాచారం. చందాలు ఇవ్వని మిర్చి ఎగుమతి వ్యాపారుల్ని జీరో, కటింగ్ వ్యాపారం ఏవిధంగా చేస్తారో బెదిరింపులకు దిగుతున్నారు. దిగుమతి వ్యాపారుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో అల్పాహార విందు పేరుతో వసూళ్లకు దిగుతున్నారు. లైసెన్స్లు లేకుండా వ్యాపారం చేసే వారిని ఎంతో కొంత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మా అండ లేకపోతే బిల్లు టు బిల్లు వ్యాపారం ఏవిధంగా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారానికి ప్రత్యేకంగా మూడు సంఘాల్లోని కొందరు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. తాము కష్టపడ్డ సొమ్ము వారికి ఎందుకు ఇవ్వాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సంఘాల నేతల నుంచి ఫోన్ వస్తే భయపడాల్సి వస్తోందని మరికొందరు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు బస్సు బోల్తా.. విజయవాడ యువతి మృతి
[ 03-06-2024]
పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెం వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. -
నోటి దురుసు అధికారి.. నిధుల స్వాహాలో సూత్రధారి
[ 03-06-2024]
ఆయనో జిల్లా ఉన్నతాధికారి. రెవెన్యూ విభాగంలో కీలక వ్యక్తి. మహిళా అధికారులు, సిబ్బందిని చులకనగా మాట్లాడుతూ చిన్నచూపు చూస్తుంటారు. కిందిస్థాయి నుంచి పదోన్నతి పొందినా చేతలన్నీ అక్కడే ఆగిపోయాయి. -
అల్లర్లకు దూరం.. అదే భవితకు వరం
[ 03-06-2024]
పల్నాడు జిల్లా పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే మారుమోగింది. అల్లర్ల విషయంలో యావత్ ప్రపంచం పల్నాడును చూసింది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చెడ్డపేరు మూటకట్టుకోవడం మంచిదికాదు. -
కాసులు రాల్చక.. కాలువలు కానక..
[ 03-06-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.70లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువల మరమ్మతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
రేపే ఉత్కంఠకు తెర
[ 03-06-2024]
ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరో కొద్ది గంటలలో ఈవీఎంలలో భద్రపరిచిన ప్రజా తీర్పును అధికారులు బహిర్గతం చేయనున్నారు. -
లెక్కింపు కేంద్రాలకు పోస్టల్ బ్యాలట్ బాక్సులు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ పత్రాలతో కూడిన బాక్సులను గట్టి భద్రత మధ్య సోమవారం మధ్యాహ్నం కల్లా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించనున్నారు. -
ఓట్ల లెక్కింపుపై దిశానిర్దేశం
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అనుసరించాల్సిన వ్యూహంపై కూటమి అభ్యర్థులు ఆదివారం తమ ఏజెంట్లతో సమావేశాలు పెట్టుకుని తగు సూచనలు చేశారు. -
అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రశాంతమైన తెనాలిలో కొంత మంది అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, -
ఉండాలా? ఊరొదిలి వెళ్లాలా?
[ 03-06-2024]
ఉండాలా? ఊరొదిలి వెళ్లిపోవాలా? అని పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాల్లో జనం ఊగిసలాటలో ఉన్నారు. ఈసారి ఫలితాలెలా వస్తాయో? గతంలోలా ఉంటే మరోసారి దాడులు తప్పవా? ఒకవేళ అధికారం మారితే ప్రతీకారం తీర్చుకుంటారా -
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధత
[ 03-06-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నూరుశాతం సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీరావు తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్కుమార్ మీనా.. -
కాయ్ రాజా.. కాయ్!
[ 03-06-2024]
ఎన్నికల్లో గెలుపోటములపై అంచనాలతో వేమూరు నియోజకవర్గంలో రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. ఈ ధన ప్రవాహానికి ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదల తరువాత తెరపడుతుందని అందరూ భావించారు. -
లెక్కింపు కేంద్రాలకు పోస్టల్ బ్యాలట్ బాక్సులు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ పత్రాలతో కూడిన బాక్సులను గట్టి భద్రత మధ్య సోమవారం మధ్యాహ్నం కల్లా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించనున్నారు. -
పిడుగుపాటుకు స్నేహితులు బలి
[ 03-06-2024]
ట్రాక్టర్పై పొలం దున్నటానికి వెళ్లిన ఇద్దరు రైతులు వర్షం కురవటంతో చెట్టు కింద నిలబడి పిడుగుపాటుకు బలయ్యారు. యడ్లపాడు మండలం ఉన్నవకు చెందిన పెద్ది చినవీరయ్య (50), చిరుతల శ్రీనివాసరావు (50) స్నేహితులు. -
‘వైకాపా ఓటమి ఖాయం’
[ 03-06-2024]
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతి అంశంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులు జోడించి విన్న వించుకున్నా మూడు -
‘అమరావతి రైతుల శాపంతో వైకాపా నాశనమవడం ఖాయం’
[ 03-06-2024]
‘రాజధాని అమరావతి రైతులు, మహిళల శాపంతో వైకాపా నాశనమవడం ఖాయం. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు కంట కన్నీరు కారేలా చేసిన పాపం ఊరికే పోదు. అధికారం చేతిలో ఉందని చెలరేగిపోయారు. -
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ మళ్లింపు
[ 03-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట పరిధిలో వాహనాల రద్దీని తగ్గించేందుకు సోమవారం నుంచి మంగళవారం వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ మలికాగార్గ్ తెలిపారు. -
పేర్ని నానిపై తుళ్లూరు స్టేషన్లో ఫిర్యాదు
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు విషయంలో అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన మచిలీపట్నం ఎమ్మెల్యే, వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని)పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు -
హింస రాజేసేందుకు కుట్రలు: ప్రత్తిపాటి
[ 03-06-2024]
రాష్ట్రంలో కౌంటింగ్ రోజు హింస రాజేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి జగన్రెడ్డి ఆధ్వర్యంలోనే కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఓట్ల లెక్కింపునకు సిబ్బందికి ఉత్తర్వులు
[ 03-06-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నియమించిన పర్యవేక్షకులు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు రెండో విడత శిక్షణ కోసం ర్యాండమైజేషన్ ద్వారా ఉత్తర్వులు అందజేశారు. -
గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థికి ఏజెంట్ల కొరత
[ 03-06-2024]
ఎన్నికలు జరిగి ఇరవై రోజులకు పైగా గడిచింది. మరో 48 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా జరగనుంది. ఇప్పటికీ గుంటూరు పార్లమెంట్ స్థానానికి వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యకు ఏజెంట్లు సర్దుబాటు కాలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్డీయే vs ఇండియా కూటమి.. ఏ పార్టీ ఎవరితో..?
-
తల్లి మృతి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీకి మధ్యంతర బెయిల్
-
లోక్సభ ఫలితాలపై ఉత్కంఠ.. ప్రపంచం చూపు భారత్ వైపు!
-
దిల్లీ మద్యం కేసు.. కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు..
-
ఉ.కొరియా వర్సెస్ ద.కొరియా.. ‘మిలటరీ డీల్’ రద్దుకు ‘సై’
-
9 ఓట్ల తేడాతో వీళ్లు.. 98శాతం ఓట్లతో వాళ్లు: లోక్సభ ఎన్నికల్లో ఈ రికార్డులు తెలుసా?