గోల్డ్ స్కీం పేరుతో టోకరా
గొలుసు కట్టు వ్యాపారంతో రూ. కోట్లలో ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసిన సంకల్ప సిద్ధి వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే నగరంలో గోల్డ్ స్కీం పేరుతో మరో మోసం బయటకు వచ్చింది.
అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే : సూర్యారావుపేట (విజయవాడ) : గొలుసు కట్టు వ్యాపారంతో రూ. కోట్లలో ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసిన సంకల్ప సిద్ధి వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే నగరంలో గోల్డ్ స్కీం పేరుతో మరో మోసం బయటకు వచ్చింది. నెలకు రూ. 2 వేల చొప్పున 11 నెలలు కడితే 12వ నెల వాయిదా వారు కట్టి, తదుపరి నెలలో మొత్తం సొమ్ము లేదా దాని విలువకు సరిపడా బంగారం ఇస్తామంటూ ఆభరణ జ్యువెలర్స్ అనే సంస్థ వందలాది ఖాతాదారులను చేర్చుకుంది. ఆ సంస్థ వాయిదాలన్నీ కట్టినా తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ కొంత మంది ఆరోపిస్తున్నారు. దీనిపై పలువురు సోమవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ కాంతిరాణాను కలిసి ఫిర్యాదు చేశారు. గుంటూరు కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఏజెంట్లను నియమించుకుని బంగారం స్కీం పేరిట వసూళ్లు చేసినట్లు సమాచారం.
గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు.. గుంటూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఆభరణ జ్యువెలర్స్, సురక్ష ట్రేడింగ్ కంపెపీ పేరిట ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. ఖాతాదారులను స్కీంల పేరిట చేర్చుకుంది. విజయవాడ నగరంలోని సీతారాంపురంలో ఒక శాఖ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పలువురు ఈ సీoలో చేరారు. వాయిదాలన్నీ చెల్లించారు. కొంత మందికి ఈ ఏడాది జనవరితో గడువు ముగిసినా వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదని సమాచారం. సంస్థ భాగస్వాముల మధ్య అభిప్రాయ బేధాలున్నాయని అందుకే దీనిపై రాద్ధాంతం జరుగుతోందని కొందరు అంటున్నారు. విజయవాడలో ఒక శాఖ ఉండటంతో బాధితులు కొందరు విజయవాడ పోలీస్ కమిషనర్ను కలుసుకుని జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలంటూ సూర్యారావుపేట పోలీసులకు పంపించారు.
గతంలోనే కేసుల నమోదు.. గుంటూరు కేంద్రంగా నడుస్తున్న ఆ సంస్థపై గతంలో స్థానికంగా నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి,. లాలాపేటకు చెందిన బాలాజీసింగ్ అనే వ్యాపారి ఏడాది క్రితం తాను తొలుత ఆ సంస్థకు రూ.10 వేలు చెల్లించగా దానికి నెలకు రూ.2 వేల చొప్పున ఎనిమిది తొమ్మిది నెలలు క్రమం తప్పకుండా చెల్లించారని దీంతో ఆ సంస్థను నమ్మి రూ.10.30 లక్షలు పెట్టుబడి పెట్టానన్నారు. ఆ తర్వాత వాటిని తిరిగి చెల్లించలేదు. పలుమార్లు దాని నిర్వాహకులతో మాట్లాడినా పలితం లేకపోవటంతో సుమారు రెండు మాసాల క్రితం ఆ సంస్థ మోసంపై అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన ‘ఈనాడు’కు వెల్లడించారు. తాను కేసు పెట్టాననే అక్కసుతో ఆ సంస్థ ఉద్యోగులను కులం పేరుతో దూషించినట్లు మహిళా ఉద్యోగి ఒకరితో ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదు ఇప్పించారని దాన్ని స్వీకరించిన అరండల్పేట పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారని తెలిపారు. తానిచ్చిన ఫిర్యాదుపై సంస్థ మీద ఛీటింగ్కేసు నమోదు చేశారని వివరించారు. కేసులో పురోగతి లేదని ఆ తర్వాత గుంటూరు ఎస్పీకి స్పందనలోనూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాడికొండకు చెందిన కల్యాణి అనే ఏజెంటు తనను ఈ సంస్థలో చేర్పించారని తనకు రకరకాల స్కీంలు ఆశ జూపినట్లు వివరించారు. బ్రాడీపేట, లక్ష్మీపురంలో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఈసంస్థ బారినపడి మోసపోయారని చెప్పారు. తనకు ఆ సంస్థ చెల్లింపులు చేసినప్పుడు రశీదులు ఇచ్చిందని, తాను చేసిన చెల్లింపులకు సంబంధించి తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆ సంస్థ మోసంపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
వివరాలపై ఆరా.. సీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు ప్రకారం సూర్యారావుపేట పోలీసులు ఆరా తీశారు. విజయవాడలోని నిర్వాహకులను పిలిపించి వారి నుంచి వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కొంత మందికి డబ్బులు చెల్లించాల్సి ఉందని వాటిని చెల్లిస్తున్నామంటూ నిర్వాహకులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. అధిక వడ్డీ ఆశచూపి, మహిళలు, క్రైస్తవ బోధకులను లక్ష్యంగా చేసుకుని రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు