విద్యార్థులూ.. తొందరపడొద్దు!
బాపట్ల జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఏటా 3,500 నుంచి నాలుగు వేల మంది కొత్తగా ప్రవేశాలు పొందుతున్నారు.
ఇంజినీరింగ్ ప్రవేశాలకు 24 నుంచి కౌన్సెలింగ్
బ్రాంచి ఎంపికలో జాగ్రత్తలు అవసరమని నిపుణుల సూచన
చీరాల అర్బన్, వేటపాలెం, న్యూస్టుడే
‘ఏపీ ఈసెట్ ఫలితాలు వెలువడ్డాయి... ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది... ఏ ర్యాంకు వచ్చింది... ఎక్కడ సీటు వస్తోంది... జిల్లాలో ఉన్న కళాశాలల్లో ఏది మంచిది... ఇక్కడ చదవాలా... ఇతర ప్రాంతాలకు వెళ్లాలా... ఏ బ్రాంచి ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు బాగా ఉంటోందనే దానిపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఇప్పటికే దృష్టిసారించారు... బ్రాంచి ఎంపికల్లో ఏ మాత్రం తొందర పడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
బాపట్ల జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఏటా 3,500 నుంచి నాలుగు వేల మంది కొత్తగా ప్రవేశాలు పొందుతున్నారు. వీటిల్లో సంప్రదాయ కోర్సులతో పాటు కృత్రిమ మేథ, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ లాంటి కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో వీటిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో వెనుకడుగు వేసిన పరిస్థితి. ప్రస్తుతం వీటికి విపరీతమైన డిమాండ్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఆటోమెషిన్ తరువాత సాంకేతికపరంగా అపారమైన అవకాశాలు రానున్నాయని ప్రచారం సాగుతోంది. అందుకే ఐఓటీ, మెషిన్ లెర్నింగ్ కోర్సులను ఇప్పటికే పలు కళాశాలల్లో ప్రవేశపెట్టారు.
సాఫ్ట్వేర్పై దృష్టి: ఇంజినీరింగ్ పూర్తిచేసిన తరువాత చాలా మంది సాఫ్ట్వేర్గా స్థిరపడాలనేది కోరిక. దీనికోసం ఎందరో సీఎస్ఈ బ్రాంచిని ఎంపిక చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఫలితంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే ఇప్పటికే చాలా కళాశాలల్లో ఈ బ్రాంచి పరిధిలో ఉన్న యాజమాన్య కోటా సీట్లు ముందుగానే భర్తీ కావడం గమనార్హం. విద్యార్థి బ్రాంచి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరో చెప్పారని కాకుండా.. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని ప్రకారం ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు బ్రాంచితో సంబంధంలేకుండా సాఫ్ట్వేర్గా స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. ప్రధానంగా సీటు ఎంపికతో పాటు కళాశాల ఎంపిక కీలకమేనని పేర్కొంటున్నారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, న్యాక్, అటానమస్, ఎన్బీఏ లాంటి వాటి గుర్తింపు, అవసరమైతే కళాశాలకు స్వయంగా వెళ్లి పరిశీలించుకోవడం చేయాలి. దీంతో పాటు ఆ కళాశాలకు చెందిన ప్రస్తుత, పూర్వ విద్యార్థులతో కలిసి బోధనతో పాటు ఇతర వాటి గురించి తెలుసుకోవడం మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంగణ ఎంపికలు గమనించాలి
కళాశాలలో చేరే సమయంలో ప్రాంగణ ఎంపికలు గురించి వాకబు చేసుకోవాలి. ఏ రకం కంపెనీలు ఇక్కడ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వేతనాల పరిస్థితి ఏమిటీ అనేదానిపై ఆరా తీయాల్సి ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు ఎక్కువ వేతనానికి ఎంతమంది ఎంపికయ్యారు? అసలు ఏడాదికి ఎంతమంది ఇక్కడ నుంచి కంపెనీలకు వెళుతున్నారు. గత ఏడాది అధిక వేతనానికి ఎంపికైన వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఉద్యోగాల కోసం సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారా? ఇతర శిక్షణలు సైతం ఏమైనా లభిస్తున్నాయా లేదా అనేదానిపై విచారించుకోవడం మంచిదనే వారు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.