అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది.
బాలారిష్టాలను దాటని హైస్కూల్ ప్లస్ టూ కళాశాలలు
పాఠ్య పుస్తకాలు, ల్యాబ్లు లేక ఉత్తీర్ణతలో వెనుకంజ
- కాకుమాను మండలం చినలింగాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ ప్లస్ టూ పేరుతో బాలికల జూనియర్ కళాశాలను రెండేళ్ల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మొదటి, రెండో ఏడాది విద్యార్థులు 11 మంది ఉన్నారు. వీరికి తగిన వసతులు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, సైన్స్ ల్యాబ్లు లేవు. దీంతో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
- పెదనందిపాడు మండలం కొప్పర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఒక్కరు కూడా ప్రథమ ఇంటర్లో చేరకపోవడంతో విద్యార్థులే లేరు.
- మేడికొండూరు మండలం పేరేచర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ టూ లో ఎంపీసీ గ్రూపులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 21 మంది బాలికల్లో 11 మంది ఉత్తీర్ణత సాధించారు. 10 మంది ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ల్యాబ్లు లేవు.
న్యూస్టుడే, ప్రత్తిపాడు
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. వీటిని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడే పర్యవేక్షించాల్సిన పరిస్థితి. ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించడంతో ప్రధానోపాధ్యాయుల ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బాలికలు ప్రవేశాలు పొందారు. విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందించలేదు. వీటి ధరలు అధికంగా ఉండి మార్కెట్లో కొరత ఉండడంతో విద్యార్థినులు కొనుగోలు చేయలేకపోయారు. రెండో ఏడాది బాలికలకు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం సబ్జెక్టులకు సైన్సు ల్యాబ్లు ఏర్పాటు చేయలేదు. ల్యాబ్స్లో ద్వితీయ ఇంటర్ బాలికలతో సాధన చేయించకుండానే పబ్లిక్ పరీక్షల ప్రాక్టికల్స్కు పంపారు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలికలు చదువుకునేందుకు పాఠ్య పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయలేదు. కళాశాలకు కేటాయించిన అధ్యాపకులతో ఇంటర్తో పాటు 9, 10వ తరగతి పాఠాలను చెప్పిస్తున్నారు. జాబ్ ఛార్ట్ లేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పేరేచర్లలో పూర్తికాని కళాశాల భవనం
క్యాలెండర్ గందరగోళం
హైస్కూల్ ప్లస్ టూ ఇంటర్లో ప్రవేశాలు పొందిన బాలికలకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పరీక్షల వరకు గందరగోళం నెలకొంది. సాధారణంగా ఇంటర్ బోర్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలకు జూన్ 1వ తేదీ నుంచి అకడమిక్ క్యాలెండర్ ప్రారంభం అవుతుంది. ఈలోపే ప్రథమ ఇంటర్లో ప్రవేశాలు చేపట్టి, ప్రథమ, ద్వితీయ ఇంటర్లో చేరిన విద్యార్థులకు తరగతులు జరుగుతాయి. త్రైమాసిక పరీక్షలు, దసరా సెలవులు, అర్ధ సంవత్సర పరీక్షలు, సంక్రాంతి సెలవులు, ప్రీఫైనల్స్, ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల అనంతరం మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కానీ హైస్కూల్ ప్లస్ టూ లో ఉన్న బాలికల జూనియర్ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ అమలు కాని పరిస్థితి నెలకొంది. తరగతుల ప్రారంభం నుంచి దసరా, సంక్రాంతి సెలవుల్లో వ్యత్యాసం ఉంటోంది. జూన్ 1 తర్వాత ప్రవేశాలు చేపట్టి ఆలస్యంగా తరగతులు ప్రారంభిస్తున్నారు. దసరా, సంక్రాంతి సెలవులు పాఠశాలకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు కళాశాలకు అమలు చేస్తున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా, సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు. పాఠశాలకు కళాశాల కంటే అధికంగా వారం రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆప్షన్, లోకల్ సెలవులు కూడా పాఠశాలలకు అధికం. దీంతో తరగతులు సాగక పాఠ్యాంశాలు జనవరి 31 నాటికి కూడా పూర్తికావు. ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే ప్రీఫైనల్, ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థినులకు సమయం లేక ఉత్తీర్ణతపై ప్రభావం పడింది.
తగిన సౌకర్యాలు కల్పించాలి
ప్లస్ టూ కళాశాలల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించి, ఇంటర్ బోర్డు ప్రకారం అకడమిక్ క్యాలెండర్ అమలు చేస్తే మెరుగైన బోధన సాధ్యమవుతుంది. మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. బాలికలకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. 20 ఏళ్ల కిందట పీజీలు పూర్తి చేసిన అధ్యాపకులకు ఇంటర్లోని ప్రస్తుత పాఠ్యాంశాలపై ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలి.
సుదర్శనం రత్తయ్య, జిల్లా అధ్యక్షుడు, స్కూల్ ప్లస్ పీజీటీ సంఘం, గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మది నిండుగా పసుపు పండగ.. ఎల్ఈడీ స్క్రీన్స్పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో వాడవాడలా కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి -
పోరాట యోధులకు అమాత్య యోగం
[ 13-06-2024]
రేపల్లె నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన అనగాని సత్యప్రసాద్ తెదేపాలో బలమైన బీసీ నేతగా ఎదిగారు -
అద్దంకి చరిత్రలోతొలి మంత్రిగా..
[ 13-06-2024]
అద్దంకి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. 1955లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎందరో దిగ్గజాలు శాసనసభ్యులుగా పని చేశారు. -
అమరావతికి అందలం.. రాజధాని రైతుల సంబరం
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల్లో ఆనందోత్సవాలు మిన్నంటాయి. అమరావతి సృష్టికర్త చంద్రబాబు ఇప్పుడు సీఎం కావడంతో రాజధానికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేశారు -
గంజాయి అనే మాట వినపడకూడదు
[ 13-06-2024]
‘గంజాయి అనే మాట వినపడకూడదు. 100 రోజుల్లో గంజాయి రహిత గుంటూరును చూడాలి’. -
మోగనున్న బడి గంటలు..!
[ 13-06-2024]
వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే ప్రారంభం కావల్సిఉన్నా సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సెలవులను ఒకరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పొడిగించారు. -
ప్రమాణ స్వీకారం చూసి.. పరవశించి..
[ 13-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జిల్లా ప్రజలు చూసి పరవశించారు -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలి
[ 13-06-2024]
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
రక్తదానం.. ‘జీవ’నది కావాలి
[ 13-06-2024]
క్యాన్సర్పై అవగాహన.. మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం.. ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ.. కొవిడ్ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారద సర్వీస్ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించటానికి పూనుకుంది. -
మంత్రివర్గ కూర్పు భేష్: ఎమ్మెల్యే జీవీ
[ 13-06-2024]
రాష్ట్ర మంత్రివర్గ కూర్పు బాగుందని, సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేశారని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. -
తెలుగు నేల మురవంగా.. చంద్రన్న సేన సగర్వంగా..
[ 13-06-2024]
-
విద్యార్థులకు ‘నాడు-నేడు’ కష్టాలు
[ 13-06-2024]
‘నాడు-నేడు’ కింద పాఠశాలల దశాదిశా మార్చేశాం అని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం వల్ల నేడు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. -
పలు కేసుల్లో పిన్నెల్లికి ముగియనున్న గడువు
[ 13-06-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, పలుచోట్ల దాడి కేసుల్లో ప్రధాన నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రెండోసారి ఇచ్చిన ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది -
పల్నాడుకు దక్కని మంత్రి పదవి
[ 13-06-2024]
పల్నాడు జిల్లాలో లోక్సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. -
టేకు చెక్కపై చంద్రబాబు త్రీడీ చిత్రం
[ 13-06-2024]
నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్ కోట రత్నాచారి కుమారుడు వెంకటాచారి చెక్కపై చంద్రబాబు చిత్రాన్ని అబ్బుర పరిచేలా చెక్కారు. -
నవ్యాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధైర్యం వచ్చింది.. ఇక కాకినాడలోనే ఉంటా: ఆరుద్ర
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మది నిండుగా పసుపు పండగ.. ఎల్ఈడీ స్క్రీన్స్పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు
-
భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్గా అర్ష్దీప్ అరుదైన ఘనత
-
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
-
రాజధానిలో నిరంతర వెలుగులు