logo

ఎలక్ట్రిక్‌ వాహనం బ్యాటరీ పేలి గాయాలు

ఛార్జింగ్‌కు పెట్టిన ఎలక్ట్రిక్‌ వాహనం బ్యాటరీ పేలడంతో ఒకరికి గాయాలైన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో  చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్‌జీఓకాలనీ వివేకానంద పార్కు సమీపంలో ఉంటున్న

Updated : 14 Aug 2022 05:07 IST

వనస్థలిపురం, న్యూస్‌టుడే: ఛార్జింగ్‌కు పెట్టిన ఎలక్ట్రిక్‌ వాహనం బ్యాటరీ పేలడంతో ఒకరికి గాయాలైన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో  చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్‌జీఓకాలనీ వివేకానంద పార్కు సమీపంలో ఉంటున్న సీహెచ్‌.కోటేశ్వర్‌రావు(32) కొంతకాలం కిందట ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని కొన్నారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఛార్జింగ్‌ కోసం పెట్టి...  పూర్తయిందా అని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా వాహనంలోని బ్యాటరీ భారీ శబ్దంతో పేలింది. మంటలు వ్యాపించడంతో ఆయన ముఖం కాలిపోయింది. స్థానికులు సమాచారం వెంటనే అగ్నిమాపక శాఖకు అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంటి ఆవరణలో వాహనం పేలిపోవడంతో పక్కనే ఉన్న సామగ్రి దగ్ధమైంది. కోటేశ్వర్‌రావును తొలుత సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని