Hyderabad: ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్: 150 కిలోమీటర్లు.. రూ.40లతో ప్రయాణం
విశ్వనగరిగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ఔటర్ రింగు రోడ్డు ఓ మణిహారం. నగరంలోని ఏ మూలకు వెళ్లాలన్నా.. ఔటర్ రింగు రోడ్డు మీదుగా నిమిషాల వ్యవధిలో వెళ్లిపోతున్నారు.
\
ఈనాడు, హైదరాబాద్: విశ్వనగరిగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ఔటర్ రింగు రోడ్డు ఓ మణిహారం. నగరంలోని ఏ మూలకు వెళ్లాలన్నా.. ఔటర్ రింగు రోడ్డు మీదుగా నిమిషాల వ్యవధిలో వెళ్లిపోతున్నారు. దూర ప్రాంతాలకు కూడా ఎటువైపు ఉన్నవారు అటు ఓఆర్ఆర్కు చేరుకుని సాగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మెట్రో రైలు వచ్చి నగర ప్రజారవాణా స్వరూపాన్నే మార్చేసింది. దీనికి ఎంఎంటీఎస్ రెండో దశ తోడైతే నగర శివార్ల నుంచి అతి తక్కువ ధరతో కాలుష్యం లేని ప్రయాణం ప్రజల సొంతం అవుతుంది. దీనికి తోడు.. ఔటర్ రింగు చుట్టూ అంటే 150 కిలోమీటర్ల మేర ప్రజా రవాణాను అందుబాటులోకి వస్తే.. ఇప్పుడు ఎంఎంటీఎస్ టిక్కెట్ ధరలను బట్టి కేవలం రూ.40లకే చుట్టూ ప్రయాణించొచ్చు.
రూ.1,500 కోట్లతో రైల్వే లైను
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైను నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఈ మేరకు రైల్వే లైన్లు నిర్మించేందుకు స్థలాన్ని సైతం కేటాయించింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక కిలోమీటరు రైల్వే లైను నిర్మాణానికి రూ.10 కోట్లు అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలా రూ.1,500 కోట్లతో రైల్వే లైన్లు నిర్మాణం పూర్తవుతుంది. ఓఆర్ఆర్ చుట్టూ రెండో లైను కోసం మరో రూ.1,500 కోట్లు కేటాయించాలి. స్టేషన్లు, రైళ్లకు అదనంగా ఖర్చు చేయాలి.
ఇరువైపులా..
ఓఆర్ఆర్ను ఆనుకుని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, విల్లాలు, ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నివాసాలు బాగా పెరిగాయి. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఓఆర్ఆర్ చేరువకు చేరిపోతున్నారు. ఓఆర్ఆర్కు చేరువగా ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు కొన్ని ఉండగా, కొత్తగా కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఔటర్ రింగురోడ్డు చుట్టూ రైల్వే లైను నిర్మించి లోకల్ రైళ్లు పరుగులు పెడితే ఎంతోమందికి ప్రజారవాణా చేరువవుతుంది. పశ్చిమాన తెల్లాపూర్, తూర్పున ఘట్కేసర్, ఉత్తరాన మేడ్చల్, దక్షిణం వైపు ఉందానగర్ వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరించి ఉంది. ఇలా నలువైపుల నుంచి నగరంలోకి సులభంగా ఎంఎంటీఎస్ ద్వారా చేరుకోవచ్చు.
నలువైపులా స్టేషన్ల అభివృద్ధి..
నగరంలోని మూడు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాలు అందుబాటులో లేక బయటే గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే విజయవాడ నుంచి వచ్చే రైళ్లను చర్లపల్లిలోనే ఆపేందుకు వీలుగా అక్కడ కొత్త రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇటు ముంబయి నుంచి వచ్చే రైళ్ల కోసం నాగులపల్లి దగ్గర స్టేషన్ను విస్తరించాల్సి ఉంది. బెంగళూరు నుంచి వచ్చే రైళ్లను ఉందానగర్ దగ్గర, నాందేడ్ మార్గంలో వచ్చే రైళ్లను మేడ్చల్ దగ్గర ఆపేయాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి. ఈ నాలుగు స్టేషన్ల నిర్మాణాలను హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. దూర ప్రాంతాల రైళ్లు కూడా నగరంలోకి రాకుండా.. చర్లపలి, ఉందానగర్, మేడ్చల్, నాగులపల్లి రైల్వే స్టేషన్లలో నగర ప్రయాణికులను దించేసి అటునుంచి అటే వెళ్లిపోయే అవకాశం ఉంది.
* ఓఆర్ఆర్ నిడివి 150 కి.మీ.
* ఓఆర్ఆర్ దాటాక 10 కి.మీ. వరకూ నగర విస్తరణ
* నగరంలోకి రాకుండానే బైపాస్ ద్వారా దూర ప్రాంతాల రైళ్లు
* నగరం నలువైపులా తలపెట్టిన రైల్వే స్టేషన్లు 4
* రూ.1,500 కోట్లతో రైల్వే లైను
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు