నకిలీ కాల్ సెంటర్ పెట్టి నిలువు దోపిడీ
దిల్లీ కేంద్రంగా నకిలీ కాల్సెంటర్ ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా వేలాది మందిని నట్టేట ముంచిన మాయగాళ్ల ముఠా ఆటకట్టించారు నగర సైబర్క్రైమ్ పోలీసులు.
స్వాధీనం చేసుకున్న సామగ్రి పరిశీలిస్తున్న సైబర్క్రైమ్ డీసీపీ స్నేహామెహ్రా, ఏసీపీ ప్రసాద్
ఈనాడు, హైదరాబాద్, నారాయణగూడ, న్యూస్టుడే: దిల్లీ కేంద్రంగా నకిలీ కాల్సెంటర్ ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా వేలాది మందిని నట్టేట ముంచిన మాయగాళ్ల ముఠా ఆటకట్టించారు నగర సైబర్క్రైమ్ పోలీసులు. నలుగురు నిందితులను సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.హరిభూషణరావు బృందం అరెస్ట్ చేసింది. 17 మొబైల్ ఫోన్లు, 7 లాప్ట్యాప్లు, ఒక సీపీయూను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్బాగ్లోని సీసీఎస్లో ఏసీపీ కేవీఎం.ప్రసాద్తో కలిసి సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహామెహ్రా మీడియాకు వివరాలు వెల్లడించారు. హరియాణా ఫరీదాబాద్కు చెందిన తరుణ్ ఓఝా(31) టెలీకాలర్గా పనిచేశాడు. తేలికగా డబ్బు సంపాదించాలని స్నేహితుడు గురుచరణ్సింగ్(26)తో కలిసి దిల్లీలో మ్యాజిక్ ట్రిప్ ఇండియా పేరిట నకిలీ కాల్సెంటర్ ప్రారంభించాడు. యోగేందర్సింగ్ బడోరియా(29) మేనేజర్. షహదత్ అన్సారీ (25) బృంద నేత నెల వేతనంతో నవీన్కుమార్(24), పరంవీర్సింగ్(30), జ్యోతికుమారి(20), జాహ్నవి తివారి(21), కాంచన్(23), అన్యద(23), అమిత్సింగ్ ఫత్యాల్(20), సౌమ్య(20), రీమా(25), మమతాకుమారి(28)లను టెలీకాలర్లుగా నియిమించుకున్నారు. నకిలీ చిరునామా, వ్యక్తుల పేర్లతో సిమ్కార్డులు సేకరించి బ్యాంకు ఖాతాలు తెరిచారు. రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ పేరుతో నకిలీ సంస్థ ఏర్పాటుచేశారు. వ్యక్తిగత, వ్యాపార రుణాల కోసం వెతికేవారిని లక్ష్యంగా చేసుకొని మొబైల్ఫోన్, వాట్సాప్ సందేశాలు పంపారు. టెలీకాలర్స్ ఫోన్చేసి మాయ మాటలతో నమ్మించారు. తరువాత ఫీజులు పేరిట దోచుకుంటారు. ఇలా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అప్పులిప్పిస్తామంటూ ఏడాదిలో 27మందిని మోసగించి రూ.5కోట్లు కొట్టేశారు.
ఇలా పట్టుబడ్డారు
గత ఏడాది డిసెంబరు 29న విశ్రాంత ఉద్యోగి గృహనిర్మాణ రుణం కోసం అంతర్జాలంలో వెతికారు. రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ అంటూ అభివన్ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఉచితంగా రుణ ప్రక్రియ పూర్తిచేస్తామంటూ రిలయన్స్ లోగోతో ఉన్న దరఖాస్తును లింక్ ద్వారా విశ్రాంత ఉద్యోగికి పంపాడు. రూ.కోటి రుణానికి దరఖాస్తు చేశాక వివిధ రకాల ఫీజుల పేరుతో రూ.30లక్షలు వసూలు చేశారు. తర్వాత ఫోన్లకు స్పందించకపోవటంతో మోసపోయినట్టు భావించిన పోలీసులు నగర సైబర్క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎంప్రసాద్ సారథ్యంలో హరిభూషణరావు, ఎస్సైలు పి.సురేష్, ఎ.శైలేందర్కుమార్, కానిస్టేబుళ్లు బి.రవిశంకర్, ఎ.రాము, మనీష్కుమార్ తివారి, సాయికుమార్ బృందం దిల్లీకి వెళ్లి తరుణ్ ఓఝా, గురుచరణ్సింగ్, యోగేందర్సింగ్ బడోరియా, షహదత్ అన్సారీలను అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!