తారు దారులు.. తొలగు అగచాట్లు
జిల్లాలో తారు దారులన్నీ సుందరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు గుంతలు పడిన రోడ్లతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడ్డారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం..
రూ.11.27 కోట్లతో పనులు షురూ
సజావుగా ప్రయాణం
న్యూస్టుడే, బషీరాబాద్, పాత తాండూరు
ఇందర్చేడ్-బషీరాబాద్ మార్గంలో..
జిల్లాలో తారు దారులన్నీ సుందరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు గుంతలు పడిన రోడ్లతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడ్డారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం.. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఇటీవల ఎమ్మెల్యే ఆదేశించడంతో గుత్తేదారులు చకచకా చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ సక్రమంగా పూర్తయితే ప్రయాణ కష్టాలు తీరుతాయని వాహనదారులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ, ఆర్అండ్బీ నిధుల రాక
జిల్లాలో మొత్తం 30 మండలాలు ఉండగా రోడ్ల నిర్మాణానికి ఒక్కో మండలానికి నిధులు విడుదల చేస్తున్నారు. తాజాగా బషీరాబాద్ మండలంలో పంచాయతీరాజ్ దారులకు రూ.7.85కోట్లు, రోడ్లు భవనాల శాఖ దారుల నిర్మాణానికి రూ.3.42కోట్లు మంజూరయ్యాయి. మైల్వార్-కంసాన్పల్లి (బి) రూ.64.6లక్షలు, పర్వత్పల్లి గేట్ నుంచి ఊరి వరకు రూ.42లక్షలు, నవల్గా-మైల్వార్ రూ.50లక్షలు, కాశింపూరు నుంచి బాద్లాపూర్ మీదుగా గొట్టిగకలాన్ వరకు రూ.30లక్షలు, బషీరాబాద్-ఇందర్చేడ్కు రూ.66లక్షలు, నవల్గా-మైల్వార్ వరకు 5.15 కోట్లు మంజూరు కాగా.. పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ నిధులతో బషీరాబాద్-మైల్వార్, జీవన్గీ-కరణ్ కోట్ దారుల పనులు త్వరలో ప్రారంభిస్తామని అశాఖ అధికారులు చెబుతున్నారు.
పెండింగ్లో ఉన్నవి సైతం..
భోజ్యా నాయక్ తండా నుంచి గ్రామం వరకు, నవల్గా నుంచి బాబునాయక్ తండా, హంక్యా నాయక్ తండా, ప్రధాన దారి నుంచి హంక్యానాయక్ తండా వరకు, బషీరాబాద్ నుంచి తౌర్యానాయక్ తండా, పర్ష్యానాయక్ తండా వరకు మట్టి దారుల నుంచి తారు రోడ్లుగా మార్చేందుకు గతంలోనే నిధులు మంజూరయ్యాయి. కానీ ఏళ్లుగా పనులు జరగడం లేదు. ఇప్పుడు వీటిని సైతం పక్షం రోజుల్లోగా పూర్తి చేసేందుకు సంబంధిత గుత్తేదారును ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని పంచాయతీరాజ్ ఇంజనీర్ వంశీ తెలిపారు. అన్నీ పూర్తయితే అందరికీ ప్రయాణ సమస్య తీరుతుందన్నారు.
నెల రోజుల్లో పూర్తి చేయిస్తాం
రోహిత్రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు
ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న దారులన్నీ బీటీ వేసి పూర్తి చేయాలని ఆదేశించాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. బషీరాబాద్ మండలం తోపాటు యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల్లోనూ అన్ని రోడ్లను అద్దంలా మార్చనున్నాం. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని నిధులు ప్రస్తుతం రాబట్టాం. ఎన్నడూ లేని విధంగా పనులు చేయిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.