logo

Hyderabad: 50 ప్లాట్లు.. రూ.33.06 కోట్లు

మొన్న కోకాపేట.. నిన్న మోకిల.. నేడు షాబాద్‌.. ఎక్కడ హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్మకానికి పెట్టినా సరే.. కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తోంది

Updated : 09 Aug 2023 08:18 IST

షాబాద్‌లో లేఅవుట్‌ వేలానికి చక్కని స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: మొన్న కోకాపేట.. నిన్న మోకిల.. నేడు షాబాద్‌.. ఎక్కడ హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్మకానికి పెట్టినా సరే.. కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని లేఅవుట్‌లో 50 ప్లాట్ల కోసం హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. మొత్తం 100 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 50 ప్లాట్లను(15,000 చదరపు గజాలు) మంగళవారం ఈ-వేలం వేశారు. ఇందులో చదరపు గజానికి ధర రూ.10 వేలుగా కనీస ధరగా చూపారు. గరిష్ఠంగా రూ.27 వేలకు, సరాసరి ధర రూ.22,040 పలికాయి. ఇక కనీస ధర రూ.18 వేలు వంతున కొనుగోలు చేశారని హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 15,000 చదరపు గజాల స్థలానికి కనీస ధర రూ.15 కోట్లుగా నిర్ణయిస్తే.. రూ.33.06 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొంది. అనుకున్న దాని కంటే ఎక్కువ స్పందన కనిపించడంతో ఇదే లేఅవుట్‌లో రెండో విడత వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని