వ్యూహాలు.. పథకాలు
రాబోయే శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని రాజధాని పరిధిలో మూడొంతుల స్థానాలను దక్కించుకోవడానికి అధికార భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
భారీ ప్రణాళికలతో అడుగులేస్తున్న భారాస
రాజధానిలో మూడొంతుల స్థానాలు లక్ష్యం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఎన్నికలయ్యే వరకు వివాదాల జోలికెళ్లొద్దు.. పూర్తిగా జనంతోనే మమేకమై ఉండండి.. నిత్యం మీ నియోజకవర్గాల్లో పర్యటించండి.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి.. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందిద్దాం..
- సీట్లు ఖరారైన అభ్యర్థులకు భారాస దిశానిర్దేశం
రాబోయే శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని రాజధాని పరిధిలో మూడొంతుల స్థానాలను దక్కించుకోవడానికి అధికార భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 29 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. వారంతా ఈ 3 నెలలు ప్రజల మధ్యే ఉండేలా.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతి అభ్యర్థితోనూ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. బుధవారం నుంచి అభ్యర్థులంతా పూర్తిగా జనంలో ఉండేలా ప్రణాళికను అమలులోకి తేబోతున్నారు. కాంగ్రెస్, భాజపాలు తమ అభ్యర్థులను ప్రకటించే సమయానికి నగరంలోని అన్ని డివిజన్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పర్యటించేలా కసరత్తు చేయబోతున్నారు. అదే సమయంలో లబ్ధిదారులకు పథకాలు అందేలా ప్రణాళిక రచిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ 29 స్థానాలకుగాను 19 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. అప్పట్లో మహేశ్వరం, ఎల్బీనగర్ నుంచి గెల్చిన సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీలోకి వచ్చారు. ఎంఐఎం 7 స్థానాలను, గోషామహల్ను రాజాసింగ్ (భాజపా) కైవసం చేసుకున్నారు. ఈసారి ఎంఐఎం మినహా కాంగ్రెస్, భాజపా స్థానాల్లో కూడా విజయం సాధించాలన్న లక్ష్యాన్ని భారాస పెట్టుకుంది. దీనికోసమే బలమైన అభ్యర్థి కోసం ఈ స్థానంలో ఎవరినీ ప్రకటించకుండా వదిలేసింది.
వరాలిలా..
బుధ, గురువారాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఒక్కో నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ నెలాఖరున లేదా వచ్చేనెల మొదటివారంలో 70,000 రెండు పడక గల ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ప్రచారం షురూ
మరోవైపు టిక్కెట్లు పొందిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీ, సుధీర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాష్గౌడ్ తదితరులు మంగళవారం నుంచి అధికారికంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మిగిలినవారు కూడా ఇదే బాటలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు ఖరారు కావడంతో సంబంధిత అభ్యర్థుల ఇళ్ల వద్ద సందడి నెలకొంది. కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యేలను అభినందనలతో ముంచెత్తారు.
నేడు, రేపు బీసీ కులవృత్తులకు రూ. లక్ష సాయం
-మంత్రి తలసాని
ఈనాడు, హైదరాబాద్: నగరంలోని బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం అందించే రూ.లక్ష సాయాన్ని బుధవారం, గురువారం అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మొదటి దశ కింద నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. సనత్నగర్, జూబ్లిహిల్స్, ముషీరాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి అందిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!