లీగల్ మెట్రాలజీ అధికారుల చేతివాటం
ఉదయం లేవగానే వినియోగించే టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకునే ముందు వాడే బెడ్ షీట్ వరకు ప్రతి వస్తువుపై తూకం, ఎమ్మార్పీ, ప్యాకేజింగ్, కొలతలను నిక్కచ్చిగా పరిశీలించే లీగల్ మెట్రాలజీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది.
స్టాంపింగ్ కోసం అడిగినంత ఇవ్వాల్సిందే
ఈనాడు, హైదరాబాద్: ఉదయం లేవగానే వినియోగించే టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకునే ముందు వాడే బెడ్ షీట్ వరకు ప్రతి వస్తువుపై తూకం, ఎమ్మార్పీ, ప్యాకేజింగ్, కొలతలను నిక్కచ్చిగా పరిశీలించే లీగల్ మెట్రాలజీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. కోటిన్నర జనాభా ఉన్న రాజధానిలో ఈ విభాగంలో 30 మందికి మించి అధికారులు లేరు. స్టాంపింగ్, వ్యాలిడిటీ సర్టిఫికేట్ల జారీకి కొందరు అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. 25 తూకం యంత్రాల స్టాంపింగ్కు రూ.10 వేలు డిమాండ్ చేసిన ఓ అధికారిణిని అనిశా ఇటీవల రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పెట్రోల్ బంకులు, వేబ్రిడ్జ్లు, ఎల్పీజీ, జ్యువెల్లరీ, ఫార్మా, రైస్, ఆయిల్ మిల్లులు, టింబర్, లిక్కర్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం దుకాణాలు, పండ్లు, టెక్స్టైల్స్, రెడిమేడ్ గార్మెంట్స్, వీక్లీ బజార్లు, స్టీల్ ట్రేడర్లు, పాన్ బ్రోకర్లు, ఎరువులు, పురుగుల మందులు.. ఇలా మొత్తం 43 విభాగాల్లోని కాంటాలపై ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. తూనికల కొలతల శాఖ చట్టం సెక్షన్ 23 ప్రకారం ఎలక్ట్రానిక్ కాంటాను ఉపయోగించే వారు కచ్చితంగా ఏటా వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇదే అదనుగా అధికారులు వ్యాలిడిటీ సర్టిఫికేట్లు, స్టాంపింగ్ చేసేందుకు ఇష్టానుసారం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని పరిధిలో ఆయా విభాగాల నుంచి మొత్తం 350 దరఖాస్తులు వస్తుండగా, వీటిని జారీ చేసేందుకు కొందరు అధికారులు భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ నిర్వాకం.. పెద్దఎత్తున స్టాంపింగ్ కోసం వచ్చే కొన్ని పరిశ్రమల ప్రతినిధులు, కన్సల్టెంట్లు రాగానే కొందరు అధికారులు బేరసారాలకు దిగుతున్నారు. ఒక్కో యంత్రానికి ఇంత ఇవ్వాల్సిందేనంటున్నారు. డబ్బు ఇవ్వని వారికి ఏవో కొర్రీలు చూపుతూ తిప్పించుకుంటున్నారు. విసిగిన ఏజెంట్లు అదే ధర ఇచ్చేందుకు ముందుకు రాగానే ఫలానా చోటుకి వస్తే మా అసిస్టెంట్ డబ్బులు తీసుకుంటారంటూ గూగుల్ మ్యాప్ లొకేషన్లు పంపిస్తున్నారు. ఇంకొందరు అధికారులు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్ చేస్తేనే మాట్లాడతామని.. సూచిస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక శాఖ నిఘా పెట్టాలంటూ వ్యాపార, పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!