logo

కాంగ్రెస్‌ అభ్యర్థి సునీత నామినేషన్‌కు సీఎం

మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్‌ వేస్తున్నారు. 

Published : 20 Apr 2024 03:25 IST

హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి,  వజ్రేశ్‌యాదవ్‌, హరివర్దన్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌

మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్‌ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. అంతాయిపల్లిలో సభా స్థలాన్ని ఆ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కలెక్టరేట్‌కు పక్కనే ఉన్న శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ, అంతాయిపల్లిలోని ఖాళీ స్థలాన్ని ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, హజ్‌ కమిటీ రాష్ట్ర సభ్యుడు మహ్మద్‌ ముజీబుద్దీన్‌ పరిశీలించారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌లో సునీతారెడ్డి నామినేషన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి వేస్తారని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం హెలికాప్టర్‌లో వస్తుండటంతో ప్రత్యేక హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని