ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం
భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు.
రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న రేణుకాచౌదరి
ఖమ్మం నగరం, న్యూస్టుడే: భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఒకరు. ఆమె ఖమ్మం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదివరకు తెదేపా నుంచి రెండుసార్లు, కాంగ్రెస్ నుంచి ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తెదేపా నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు, ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికైనప్పుడు రేణుకాచౌదరి కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకున్నారు.
తెదేపాతో రాజకీయ అరంగేట్రం
1984లో తెదేపాలో చేరిన రేణుకాచౌదరి 1986లో హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. తెదేపా తరఫున 1986 నుంచి 1998 వరకు వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రధాని హెచ్డీ దేవేగౌడ్ కేబినెట్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఆమె తెదేపాను వీడి కాంగ్రెస్లో చేరారు. 1999లో ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. 2004లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి రెండోసారి ఎన్నికై మన్మోహన్సింగ్ కేబినెట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమె 2014లో పోటీచేయలేదు. 2019లో పోటీచేసి ఓటమి చెందారు. 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. తాజాగా 2024లోనూ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె నాలుగోసారి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. లోక్సభ సభ్యురాలిగా రెండుసార్లు పనిచేశారు. లోక్సభ, రాజ్యసభకు ఎన్నికవటం, రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఆమె ప్రత్యేకత నిలుపుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.