కళలకు వేదిక..ప్రతిభా వీచిక
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
కళారాధనలో ఉచిత శిక్షణలు
బొమ్మలు గీయడంలో తర్ఫీదు పొందుతున్న బాలలు
నంద్యాల గాంధీచౌక్, న్యూస్టుడే: చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఏటా వేసవిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల చిన్నారులు వారికి ఇష్టమైన అంశాలను నేర్చుకునేలా వెన్నుదన్నుగా నిలుస్తోంది. వివిధ విభాగాల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. శాసీˆ్త్రయ నృత్యం, ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, వాయిద్య సంగీతంలో గిటార్, కీబోర్డు, మిమిక్రి, వెంట్రిలాక్విజం, చిత్రలేఖనం, దస్తూరి, హస్తకళలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పద్యపఠనం, సంస్కృత శ్లోకాలు, కవితాగానం, కవితారచన, చదరంగం, కరాటే, తైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో నిపుణులతో తర్ఫీదు ఇస్తోంది. కొన్ని ఏళ్లుగా పిల్లలు ఇక్కడ శిక్షణ పొంది వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్నారు. కొంత మంది ఇక్కడే శిక్షణ పొంది ప్రస్తుతం కోచ్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆనందంగా ఉంది
ప్రస్తుతం 22వ కళారాధన శిబిరాన్ని మే 26 వరకు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రెండు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం మరువలేనిది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు వివిధ విభాగాలలో శిక్షణ పొంది ఉన్నత స్థాయిలోకి వెళ్లడం హర్షనీయం. ఈ సారి వేసవి శిక్షణశిబిరాలు నిర్వహిస్తాం. 25 మంది శిక్షకులతో తర్ఫీదు ఇస్తున్నాం.
డాక్టర్ మధుసూదన్రావు, కళారాధన అధ్యక్షుడు
సేవలు అందిస్తున్నాం
కరోనా సమయంలో మినహా మిగతా అన్ని సంవత్సరాలు వేసవిలో లలితకళల ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. వేసవిలో విద్యార్థులకు అదనంగా ఉపయోగపడే కళానైపుణ్యాలు అందిస్తున్నాం. ప్రతి ఏటా 20 విభాగాల్లో 400 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఉచితంగా ఇస్తున్నాం. ఇక్కడే శిక్షణ పొందిన విద్యార్థులు నేడు కోచ్లుగా వ్యవహరించడం అభినందనీయం. ఒకేసారి 20 విభాగాలలో అందిస్తున్నాం. శిక్షణ తరగతుల ముగింపు రోజున విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ప్రశంసాపత్రాలు అందించనున్నాం.
డాక్టర్ రవికృష్ణ, కళారాధన ప్రధాన కార్యదర్శి
శిక్షకుడిగా చేయడం సంతోషకరం
నంద్యాల కళారాధన ప్రారంభమైన 2000 సంవత్సరం నుంచి నేను డ్యాన్స్లో శిక్షణ పొందాను. కొన్ని సంవత్సరాల పాటు తర్ఫీదు పొందిన అనంతరం ఇక్కడే శిక్షకుడిగా సేవలు అందించడం గర్వకారణం. ఎంతోమంది విద్యార్థులు వేసవిలో ఉచితంగా డ్యాన్స్ను నేర్చుకుంటున్నారు.
సతీష్, డ్యాన్స్మాస్టర్, నంద్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామతీర్థంలో రామలింగేశ్వస్వామికి, గాయత్రీదేవికి ప్రత్యేక పూజలు
[ 02-06-2024]
మండలంలోని రామతీర్థం క్షేత్రంలో రామలింగేశ్వరస్వామికి, గాయత్రీదేవికి ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి పూజలు చేశారు. -
ఉద్యోగుల ఓటు..గెలుపు మలుపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితం రెండు రోజుల్లో తేలనుంది.. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
దారికాచిన మృత్యువు
[ 02-06-2024]
అప్పటి వరకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో విషాదం నెలకొంది.. బావమరిది పెళ్లి కోసం భాగ్యనగరం నుంచి ఆళ్లగడ్డకు వచ్చారు.. వారం రోజులు ఆనందంగా గడిపారు. -
రమణీయం.. గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం
[ 02-06-2024]
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కోడుమూరు మండలంలోని వెంకటగిరిలో గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. -
ఫలితాలపై పందేల జోరు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పందేలు తారస్థాయికి చేరాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో పందేలు జోరందుకున్నాయి. -
రైలు ప్రయాణంలో సమస్యా..139కి ఫోన్ చేయండి
[ 02-06-2024]
ఇలా... రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు వచ్చినా....విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నా, ఇతరుల వల్ల ఇబ్బందులు కలిగినా... మనోవేదనకు గురికాకుండా అత్యవసర నంబరు 139కు ఫోన్చేస్తే చాలు. -
కుదరని సరిహద్దు సయో
[ 02-06-2024]
మల్లన్న క్షేత్రంలో ‘భూ’ పంచాయతీ రాజుకుంది. హద్దులకు సంబంధించి ఆలయ, అటవీ శాఖ అధికారుల మధ్య గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. -
మూడెకరాలు హాంఫట్
[ 02-06-2024]
ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కాజేద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. పోరంబోకు భూములు, వంకలు, చెరువులను యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నా...సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. -
ప్రభుత్వ కళాశాలలో 60 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 60 మంది విద్యార్థులకు అధ్యాపకులు రుసుము చెల్లించి ఆదర్శంగా నిలవనున్నారు. -
ఏఎంసీలో మరణాల శాతం తగ్గించేలా చర్యలు
[ 02-06-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో మరణాల శాతం తగ్గించడమే వైద్యుల లక్ష్యం కావాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. -
డిగ్రీ పరీక్షలో 26 మంది డిబార్
[ 02-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన 26 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు వీసీ సుధీర్ ప్రేమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. పాపువా న్యూగినియాపై వెస్టిండీస్ విజయం
-
గాజాలో దాడులు.. ‘ఇజ్రాయెల్’పై మాల్దీవులు కీలక నిర్ణయం!
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్