దాచిన సొమ్ము దోచుకున్నారు
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు.
మోసాలకు పాల్పడుతున్న తపాలా ఉద్యోగులు
శ్రీరంగాపురం తపాలా కార్యాలయం
ఆళ్లగడ్డ, రుద్రవరం, న్యూస్టుడే: పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూడబెట్టుకున్న పేదోళ్ల సొమ్ముపై రాబందుల్లా పడి దోచేస్తున్నారు. దాచుకుంటే సొమ్ముకు భద్రత ఉందనుకునే వారి నమ్మకాలను వమ్ము చేస్తున్నారు. పోస్టాఫీసులు ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. మరి వారెలా స్పందిస్తారో చూడాల్సిందే. తాజాగా రుద్రవరం మండలం శ్రీ రంగాపురంలో బీబీఎంగా పనిచేస్తున్న శరత్నాయక్ ప్రజలకు చెందిన ఆర్డీ, పోస్టల్ సేవింగ్స్కు సంబంధించిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి పక్కదారి పట్టించారని స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. బీబీఎంగా ఏడాది కిందటే విధుల్లో చేరిన ఆయన దాదాపు ఈ పోస్టాఫీసు పరిధిలో ఇప్పటివరకు 62 మంది ఖాతాదారులకు చెందిన రూ.3,48,211 పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది.
బయటపడిందిలా
శ్రీ రంగాపురం బ్రాంచ్ పోస్టాఫీసు పరిధిలో శ్రీరంగాపురం, డి.కొట్టాల, టి.కొట్టాల గ్రామాలు వస్తాయి. టి.కొట్టాలకు సంబంధించిన ఒక ఖాతాదారు ఐదేళ్ల పాటు ఆర్డీ కట్టిన తర్వాత డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. బీబీఎం శరత్ నాయక్ మాత్రం ఆర్డీ పుస్తకాలు ఖాతాదారుకు ఇవ్వకుండా వేధించారు. అనుమానం వచ్చిన ఖాతాదారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి విచారించగా ఏడాది నుంచి ఖాతాదారు అక్కౌంట్లో డబ్బులు జమ కావడం లేదని తేలింది. తాను నెల నెలా బీబీఎంకు డబ్బులు ఇస్తున్నానని ఆయన చెప్పారు. లోతుగా విచారించగా ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకుని పోస్టాఫీసులోని ఖాతాల్లో బీబీఎం జమ చేయకుండా పక్కదారి పట్టించినట్లు నిరూపణ అయ్యింది. ఇప్పటివరకు శ్రీ రంగాపురానికి చెందిన వారి నుంచి మాత్రమే వివరాలు సేకరించారు. ఇంకా ఎస్.కొట్టాల, టి.కొట్టాల గ్రామాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తే బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తమ సొమ్ము పోస్టాఫీసులో అయితే భద్రంగా ఉంటుందని ఇక్కడ పొదుపు చేస్తే ఖాతాల్లో సిబ్బంది జమ చేయకపోవడంతో మోసపోయామని బాధితులు వాపోతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలో పడకండ్ల గ్రామంలో ఒక బీబీఎం ఖాతాదారులకు చెందిన రూ.65 వేలను జమ చేయకుండా సొంతానికి ఉపయోగించుకున్నారు.
- ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణాపురానికి చెందిన బీబీఎం ఒకరు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పే ఆర్డరు నకిలీ కాపీలను సృష్టించి డబ్బులను విత్డ్రా చేసుకున్న ఘటన జరిగింది.
- నందికొట్కూరు పరిధిలోని మల్యాల గ్రామ పోస్టాఫీసు పరిధిలో పొదుపు ఖాతాదారులకు చెందిన రూ.1.20 లక్షల సొమ్మును బీబీఎం పక్కదారి పట్టించారు.
కూడబెట్టిన సొమ్ము తినేశారు
నెలకు రూ.200 చొప్పున ఆర్డీ కట్టాను. ఎంతో కష్టపడి పొదుపు చేసిన సొమ్ము మరో నెలలో నా చేతికందుతుందని భావిస్తుంటే ఈ లోగా సొమ్మును ఖాతాలో వేయకుండానే పక్కదారి పట్టించారు. నేను చెల్లించిన సొమ్ముకు ఎవరు జవాబుదారీ వహిస్తారు. డబ్బుల్ని పూర్తిగా అధికారులు చెల్లించాలి.
వెంకటసుబ్బమ్మ, శ్రీరంగాపురం
నెలకు రూ.వెయ్యి చెల్లించాను
నెలకు రూ.1000 చొప్పున ఆర్డీ(రికరింగ్ డిపాజిట్)లో పొదుపు చేశాను. 9 నెలలుగా నా ఖాతాలో డబ్బు జమ కాలేదు. పోస్టాఫీసులో డబ్బు భద్రంగా ఉంటుందని భావించాను. కానీ ఇక్కడ కూడా ఇలా మోసం జరగడంతో మా వంటి పేద, మధ్య తరగతి వారు డబ్బులు ఎక్కడ పొదుపు చేయాలో అర్థం కాని స్థితి నెలకొంది.
వెంకటసుబ్బయ్య, శ్రీరంగాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామతీర్థంలో రామలింగేశ్వస్వామికి, గాయత్రీదేవికి ప్రత్యేక పూజలు
[ 02-06-2024]
మండలంలోని రామతీర్థం క్షేత్రంలో రామలింగేశ్వరస్వామికి, గాయత్రీదేవికి ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి పూజలు చేశారు. -
ఉద్యోగుల ఓటు..గెలుపు మలుపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితం రెండు రోజుల్లో తేలనుంది.. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
దారికాచిన మృత్యువు
[ 02-06-2024]
అప్పటి వరకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో విషాదం నెలకొంది.. బావమరిది పెళ్లి కోసం భాగ్యనగరం నుంచి ఆళ్లగడ్డకు వచ్చారు.. వారం రోజులు ఆనందంగా గడిపారు. -
రమణీయం.. గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం
[ 02-06-2024]
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కోడుమూరు మండలంలోని వెంకటగిరిలో గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. -
ఫలితాలపై పందేల జోరు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పందేలు తారస్థాయికి చేరాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో పందేలు జోరందుకున్నాయి. -
రైలు ప్రయాణంలో సమస్యా..139కి ఫోన్ చేయండి
[ 02-06-2024]
ఇలా... రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు వచ్చినా....విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నా, ఇతరుల వల్ల ఇబ్బందులు కలిగినా... మనోవేదనకు గురికాకుండా అత్యవసర నంబరు 139కు ఫోన్చేస్తే చాలు. -
కుదరని సరిహద్దు సయో
[ 02-06-2024]
మల్లన్న క్షేత్రంలో ‘భూ’ పంచాయతీ రాజుకుంది. హద్దులకు సంబంధించి ఆలయ, అటవీ శాఖ అధికారుల మధ్య గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. -
మూడెకరాలు హాంఫట్
[ 02-06-2024]
ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కాజేద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. పోరంబోకు భూములు, వంకలు, చెరువులను యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నా...సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. -
ప్రభుత్వ కళాశాలలో 60 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 60 మంది విద్యార్థులకు అధ్యాపకులు రుసుము చెల్లించి ఆదర్శంగా నిలవనున్నారు. -
ఏఎంసీలో మరణాల శాతం తగ్గించేలా చర్యలు
[ 02-06-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో మరణాల శాతం తగ్గించడమే వైద్యుల లక్ష్యం కావాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. -
డిగ్రీ పరీక్షలో 26 మంది డిబార్
[ 02-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన 26 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు వీసీ సుధీర్ ప్రేమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గాజాలో దాడులు.. ‘ఇజ్రాయెల్’పై మాల్దీవులు కీలక నిర్ణయం!
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య