నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు
భూముల ధరలు పెరుగుతండటంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు.
ఓ వెంచర్లో రాళ్లు తొలగిస్తున్న పుర అధికారులు
కల్వకుర్తిపట్టణం, న్యూస్టుడే : భూముల ధరలు పెరుగుతండటంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందుతూ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా రూ. లక్షల ధర నిర్ణయించి ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అంటగడుతూ మోసాలకు తెరలేపుతున్నారు. గోరంత అనుమతి తీసుకుని కొండంత వెంచర్గా మార్చి విక్రయాలు చేస్తున్నారు. అనుమతులు పొందే సమయంలో 10శాతం భూమిని చూపిస్తూ తర్వాత విక్రయాలు చేస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాలు సక్రమంగా సాగించుకునేందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నియోజకవర్గ కేంద్రాలైన నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలికలతో పాటు శివారు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
రికార్డులు కనుమరుగు.. : సుమారు 10సంవత్సరాల క్రితం జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాలు పంచాయతీల నుంచి పురపాలిక సంఘాలుగా మారాయి. అప్పట్లో ఎలాంటి అభివృధ్ధి చేయకున్నా వెంచర్లకు అనుమతులు ఇచ్చారు. వాటికి సంబంధించి దస్త్రాలు పూర్తిగా కనుమరుగు చేశారు. పురపాలికగా ఏర్పడ్డాక గత ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి 10శాతం భూమిని ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన తేవడంతో కొంత మార్పు వచ్చింది. గతంలో నిర్మించిన అక్రమ వెంచర్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించినా ముందుకు రాలేదు. అక్రమమని ఉన్నతాధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యగా రాళ్లు తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి యథావిధిగా రాళ్లు పాతుకుంటున్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ సర్వేనంబంలో 2007సంవత్సరంలో రెండు ఎకరాలకు అనుమతి తీసుకుని 4ఎకరాల వెంచర్ చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో పుర అధికారులు చర్యలు చేపట్టారు. కల్వకుర్తి పట్టణాన్ని అనుసరించి ఉన్న కుర్మిద్ద శివారులో ఒకే పేరుతో సుమారు 50ఎకరాల్లో వెంచర్ నిర్మించారు. దాని ద్వారా పంచాయతీకి సుమారు మూడు ఎకరాల స్థలం కేటాయించాలి. ఇలా తాండ్ర, కొట్ర, మార్చాల శివారులో పదుల సంఖ్యలో వెంచర్లను వందల ఎకరాల్లో నిర్మించారు. అందులోని పంచాయతీలకు చెందిన 10శాతం భూమిని పాలకులు, వ్యాపారులు అధికారుల సహకారంతో విక్రయించుకుని ఆదాయం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పదిశాతం భూమిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈవిషయమై టీపీవో విజయ్కుమార్ను వివరణ కోరగా.. పురపాలిక పరిధిలోని వెంచర్లలో 10శాతం ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, అక్రమ వెంచర్లను గుర్తించి రాళ్లు తొలగించామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తడిబొమ్మ.. కావద్దమ్మా
[ 15-06-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు బాల్య వివాహాల సమస్య తీవ్రంగా ఉండేది. కానీ విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో చాలావరకు ఈ సమస్య తగ్గుముఖం పట్టింది. -
పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ
[ 15-06-2024]
పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. భూతాపం పెరిగి గడిచిన వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కొత్త బీమా.. రైతుకు కొండంత ధీమా!
[ 15-06-2024]
చిరుజల్లులు కురవగానే రైతన్నలు సంతోషంగా దేవుళ్లను ప్రార్థించి పొలం పనులు ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు. -
రామోజీరావుకు మాజీ మంత్రి నివాళి
[ 15-06-2024]
‘రామోజీ’ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ నివాళి అర్పించారు. -
పాఠశాలల బలోపేతమే లక్ష్యం
[ 15-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా కార్యాచరణ ప్రారంభించామని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి తక్కువ.. ప్రైవేటుకు ఎక్కువ..!
[ 15-06-2024]
పాలమూరులో గత యాసంగిలో రైతులు పండించిన పంటలో పావు శాతం ధాన్యం కూడా ప్రభుత్వం సేకరించలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కర్షకులు ప్రతి సీజన్లో పెద్ద ఎత్తున ధాన్యాన్ని విక్రయించేవారు. -
వానాకాలం సాగుకు రైతులు సిద్ధం
[ 15-06-2024]
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల కింద ముందస్తు సాగుపై ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. -
బస్టాండ్లలో రెండింతల వసూలు
[ 15-06-2024]
ఆర్టీసీ బస్టాండ్లలో దోపిడీ ఎక్కువైనా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అన్ని బస్టాండ్లలో ఉచిత మరుగుదొడ్ల(శౌచాలయాలు)ను అందుబాటులో ఉంచాలి. -
శునకాలతో బెంబేలు
[ 15-06-2024]
గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టారీతిలో వీధి కుక్కలు సంచరిస్తూ మనుషులు, వివిధ రకాల జంతువులపై దాడులకు పాల్పడుతుండటంతో ఆందోళన నెలకొంది. -
విలువైన భూములున్నా.. నిర్వహణ కరవు
[ 15-06-2024]
విలువైన భూములు ఉండి ప్రాశస్త్యం ఉన్న ఆలయాలకు నిర్వహణ కరవైంది. దూపదీప నైవేధ్యాలకు భక్తులే దిక్కవుతున్నారు. ఈ పరిస్థితి కొల్లాపూర్ మండలంలోని దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని పలు దేవాలయాలది. -
ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్పించిన ఎస్సై
[ 15-06-2024]
విద్యాశాఖ చేపట్టిన బడిబాట సత్ఫలితాలను ఇస్తోంది. మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయం డీసీఆర్బీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.రాణి, కొత్తకోటలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న తిరుమలేశ్ దంపతులు. -
కవలలు సహా గర్భిణి మృతి
[ 15-06-2024]
ఆస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్సలు అందించకపోవడంతో తల్లితోపాటు కడుపులోని ఇద్దరు కవలు మృతిచెందారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు నారాయణపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
-
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
-
వాళ్ల స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్ అశ్విన్
-
భారీ మెజార్టీతో గెలిపించారు.. నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో నారా లోకేశ్
-
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
-
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ఎలా ఉంది?