logo

ఎన్నికల బరిలో మొల్గర అల్లుళ్లు

భూత్పూర్‌ మండలానికి చెందిన ఇద్దరు అల్లుళ్లు శాసనసభ ఎన్నికల బరిలో ఉన్నారు.

Published : 29 Oct 2023 05:12 IST

యెన్నం  శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌ రెడ్డి

భూత్పూర్‌, న్యూస్‌టుడే : భూత్పూర్‌ మండలానికి చెందిన ఇద్దరు అల్లుళ్లు శాసనసభ ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించిన జాబితాలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్రకు జి.మధుసూదన్‌రెడ్డి అభ్యర్థులుగా చోటు దక్కింది. కొత్తమొల్గరకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు తూము లక్ష్మారెడ్డి, మాధవి దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీప్రసన్నను మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మనువాడారు.

జి.మధుసూదన్‌రెడ్డి పాతమొల్గర గ్రామానికి చెందిన రైతు అమిస్తాపూర్‌ వెంకటరెడ్డి, లలితమ్మల నాల్గో సంతానం కవితను వివాహం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాలు గతంలో ఒకే పంచాయతీగా ఉండేవి. మొల్గర అల్లుళ్లు ఇద్దరు పోటీలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు