ఐదేళ్లకు ఓ పూట
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది...
సమయం లేదా మిత్రమా
ఓటర్లు పెరిగి పోలింగ్ తగ్గుతున్న వైనం
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి ఓ పోలింగ్కేంద్రంలో నిలుచున్న మహిళలు
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... అలాంటిది ఐదేళ్లకోమారు వేసే ఓటుపై మాత్రం ఎంతో అనాసక్తత ప్రదర్శిస్తున్నారు... ఆ కొన్ని గంటల మన నిర్లక్ష్యం మూలాన ప్రజాభిప్రాయం సరిగా ప్రతిఫలించట్లేదని గుర్తించాలి..
న్యూస్టుడే, గద్వాల న్యూటౌన్, ఊట్కూరు: ఉమ్మడి జిల్లాలో ఓటింగ్కు దూరమయ్యేవారు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో తొలి, రెండోదశ లోక్సభ ఎన్నికలు ముగిశాయి. చాలా రాష్ట్రాల్లో 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. కేరళలో 2019లో 77.67 శాతం నమోదవగా, ప్రస్తుతం 65.91 శాతం మాత్రమే నమోదయ్యింది. రాజస్థాన్లో 66.34 శాతం నుంచి 64.07 శాతానికి తగ్గింది. తమిళనాడులో 72.44 శాతం నుంచి 69.72 శాతానికి తగ్గింది. కొత్త ఓటర్లు పెరుగుతున్నా.. ఓట్లేసే వారి సంఖ్య తగ్గుతోంది. మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఈ తరహా పరిస్థితులు గత లోక్సభ ఎన్నికల్లో చూశాం.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గత ఎన్నికల్లో 11.12 లక్షల మంది దూరం 2009 ఎన్నికల్లో 9.32 లక్షల మంది ఓటు వేయలేదు. వీరిలో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 4.94 లక్షల మంది, నాగర్కర్నూల్ పరిధిలో 4.38 లక్షల మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో 7.79 లక్షల మంది ఓటు వేయలేదు. 2019 ఏప్రిల్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 11.12 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇందులో మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో 5.17 లక్షల మంది ఉంటే.. నాగర్కర్నూల్ పరిధిలో 5.95 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా యువత ఓటుకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పరిధిలో 16,80,417 మంది ఓటర్లు, నాగర్కర్నూల్ పరిధిలో 17,34,773 మంది ఓటర్లున్నారు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి దాదాపు 3.27 లక్షల మంది ఓటర్లు పెరిగారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడితేనే పోలింగ్ శాతం పెరగనుంది.
స్వీప్ దృష్టి సారిస్తేనే..
మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో అధికారులు, విద్యార్థులు, ఓటర్లు కలసి 5కే రన్ నిర్వహించడంతో పాటు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. మహిళా సంఘాలతో ర్యాలీలు, ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓటరు గైడ్ల పంపిణీ చేపడుతున్నారు. త్వరలోనే ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వీటితో పాటు ఇంకా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడితేనే ఫలితం ఉంటుంది. యంత్రాంగం ఎంతచేసినా పౌరుడిగా మన బాధ్యత నెరవేర్చినప్పుడే ఫలితం ఉంటుంది. .
ఓటు వేసేలా చర్యలు : శాసనసభ ఎన్నికల్లో స్వీప్ ద్వారా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఓటర్లలో అవగాహన, చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యాసంస్థలకు సెలవులు ఉండటం కొంత ఇబ్బందిగా ఉంది. బీడీ కార్మికులు, మహిళా సంఘాలు, ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. యువతపై దృష్టి పెట్టాం.
రమేశ్బాబు, జ్యోతి, స్వీప్ జిల్లా నోడల్ అధికారులు, గద్వాల, నారాయణపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మారని తీరు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికపై పాలమూరు ఓటర్ల ఆసక్తి తగ్గుది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుది. -
స్ట్రాంగ్రూంలకు చేరిన ఈవీఎంలు
[ 15-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో మంగళవారం భద్రపరిచారు. -
పీయూ ఉపకులపతి పదవికి తీవ్ర పోటీ
[ 15-05-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ) పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : డీకే అరుణ
[ 15-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
అలసి.. సొలసి.. సేదదీరి!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు మంగళవారం కాస్త తీరికగా కనిపించారు. -
ఇన్నాళ్లు కళకళ.. నేడు వెలవెల
[ 15-05-2024]
తెలంగాణలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా మహబూబ్నగర్లో సందడి నెలకొన్న ప్రధాన పార్టీల కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. -
ఎన్నికల సిబ్బంది ప్రయాణ కష్టాలు
[ 15-05-2024]
ఎన్నికల సిబ్బంది పోలింగ్ అనంతరం ఇళ్లకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొని వచ్చి అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్పగించారు. -
మట్టి పాత్రలకు మంచిరోజులు
[ 15-05-2024]
కరోనా తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యం పట్ల జనానికి స్పృహ పెరిగింది. అందులో భాగంగా అల్యూమినియం, స్టీల్పాత్రలు వంటలకు ఉపయోగించడం మానుకొని మట్టి పాత్రలు వాడేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 15-05-2024]
మద్యం దుకాణం నిర్వాహకులు చేసిన దాడిలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. -
తీరని సాగునీటి గోస
[ 15-05-2024]
యాసంగి సీజన్లో సాగు నీటి సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. సింగోటం జలాశయం నుంచి గోపల్దిన్నె జలాశయానికి లింకు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తేనే సాగునీటి సమస్య తీరనుంది. -
భారాస కౌన్సిలర్ కుటుంబంపై దాడి
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. -
పుస్తకాలొచ్చాయ్.. వస్త్రమే రాలె
[ 15-05-2024]
రాబోయే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చాయి. తొలివిడత ఇప్పటికే 20 శాతం మేరకు పుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ గోదాముకు చేరాయి. -
పురాల్లో పన్ను బాదుడు
[ 15-05-2024]
పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు మొదలైంది. కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం నమోదు చేయడంతో పన్ను దారులు లబోదిబోమంటున్నారు. -
వాళ్లమ్మిందే మందు!
[ 15-05-2024]
జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల వారిదే ఇష్టారాజ్యమవుతోంది. -
ఆరు బూత్లలో 50 శాతం లోపే పోలింగ్
[ 15-05-2024]
నాగర్ కర్నూల్ లోకసభ స్థానం పరిధిలోని గద్వాల పురపాలక సంఘంలో అతి తక్కువగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు వెలుగుచూడటంపై ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
5.3 లక్షల మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 5.30 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా..
తాజా వార్తలు (Latest News)
-
సామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ను ఓడించిన పంజాబ్
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి