తీరని నష్టం.. సాగుకు కష్టం
చెరువు కట్ట నాసిగా నిర్మించడంతో పూర్తిగా నిండకముందే కోసుకుపోయి రైతుల పొలాలన్నీ నీట మునిగి ఇసుక పాలయ్యాయి. పదుల సంఖ్యలో రైతులు నష్టపోయారు. ఇసుక మేట వేయగా.. దాన్ని పూర్తిగా తొలగిస్తేనే మరో పంట సాగుకు అవకాశం ఉంటుంది.
పొలాల దుస్థితి
న్యూస్టుడే, శివ్వంపేట
రత్నాపూర్ గ్రామంలోని అంబరెడ్డి అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. దీని ఆధారంగా 700 ఎకరాల వరకు సాగవుతోంది. 500 మంది రైతులు ఆధారపడ్డారు. అటవీ ప్రాంతంలో కురిసిన వాన నీరంతా ఇందులోకి చేరుతుంది. ఇటీవల కురిసిన వాన నీరంతా ఒక్కసారిగా రాగా.. తూముపై ప్రభావం పడింది. దీంతో కట్ట తెగిపోగా.. 17 మంది రైతులకు చెందిన 32 ఎకరాలు ఇసుక, మట్టి మేట వేసింది. ఏళ్లుగా సాగులో ఉన్న ఈ భూములకు ఎలాంటి పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం గమనార్హం. గతంలో పన్నులు చెల్లించినా పాసుపుస్తకాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. అంబరెడ్డి చెరువును మిషన్ కాకతీయ రెండో విడతలో రూ.15 లక్షలతో బాగు చేశారు. అలుగు, కట్ట, తూములు నిర్మించి అభివృద్ధి చేపట్టారు. 15 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల వెడల్పుతో కట్ట నిర్మించారు. ఆ పనులు నాసిగా చేపట్టడంతోనే ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు.
మేటలు తొలగిస్తేనే.. చెరువు కట్ట తెగడంతో నీరంతా 2 కి.మీ. దూరంలోని అల్లీపూర్ పెద్ద చెరువులోకి చేరింది. అంత దూరం వరకు 32 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ఇక్కడ తిరిగి సాగు చేయాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఇసుక పూర్తిగా తొలగేవరకు ఇదే పరిస్థితి. ట్రాక్టర్లతో దున్నితే కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ అడవిలో నుంచి వస్తున్న వరద నేరుగా సాగు భూముల్లోకే పారుతోంది. వెెంటనే కట్ట నిర్మించి పైనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయల్సిన అవసరం ఉంది. కట్ట మరమ్మతులకు రూ.50 లక్షలకు పైగా నిధులు అవసరమని అధికారుల అంచనా. గతంలో కట్టలో కర్రలు, చెట్ల కొమ్మలు వేసి మట్టి వేసినట్లు గుర్తించారు. నీటి ప్రవాహం ఉన్నన్ని రోజులూ ఎలాంటి మరమ్మతులు చేసేందుకు అవకాశం లేదని నీటిపారుదల ఏఈ సునీత తెలిపారు.
ప్రాణాపాయం తప్పింది..: ఊట్ల మలేశ్
నాకు చెరువు కట్ట తెగిన చోట ఆనుకుని మూడెకరాలు ఉండగా వరి నాటు వేశాం. సగం మేర ఇసుక మేట వేసింది. బోరు స్టార్టరు, కేబుల్ తీగ కొట్టుకుపోయింది. రాత్రి వేళలో కట్ట కోసుకుపోవడంతో ప్రాణాపాయం తప్పింది. శాశ్వత పరిష్కారం చూపాలి.
రెండెకరాలలో..: కాట్రోత్ లచ్చిరాం
చెరువు కింద రెండెకరాలలో వరి సాగు చేశాను. కట్ట కోసుకుపోయి పొలం పూర్తిగా ఇసుకతో నిండింది. చెరువులో నీరు నిల్వ ఉంటేనే బోర్లు నీరు పోస్తాయి. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు