‘రాజీనామాలతో కొత్త నాటకం’
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు.
నిజాంపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం
నిజాంపేట(రామాయంపేట): రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. నిజాంపేటలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా ఉండి రూ.లక్ష రుణమాఫీ చేయని హరీశ్రావు.. రూ.రెండు లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్రెడ్డికి సవాలు విసరడం మీడియా దృష్టిని ఆకర్షించడానికేనన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ చేయనందుకు మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు.. మార్చి 19న దిల్లీ నుంచి హైదరాబాద్కు విమానంలో వస్తూ రాజీనామా నాటకానికి పథకం వేశారన్నారు. రుణమాఫీ చేయనందుకు అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాలని సూచించారు. రేవంత్రెడ్డి, హరీశ్ రావు ఇద్దరూ అనుకొని రోజు మీడియాలో వాళ్ల గురించే వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్కు ఇది అర్థమయ్యే లోపు హరీశ్రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్లిపోతారని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో భాజపాకు ఉన్న ఆదరణ తట్టుకోలేక భారాస, కాంగ్రెస్లు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్ విషయంలో తాము స్పష్టతతో ఉన్నామని, కాంగ్రెస్, భారాస అందుకు భిన్నంగా వారి విధానం విడదీయరాని బంధంగా ఉందన్నారు. ఓబీసీ, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఉండాలనేది భాజపా విధానమన్నారు. భాజపా ఏనాడూ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అనలేదన్నారు. ఈ సందర్భంగా పలువురు భాజపాలో చేరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
[ 08-05-2024]
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. -
లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం
[ 08-05-2024]
రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. -
ఆరుగాలం పంట.. ఆగమాగం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. -
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
[ 08-05-2024]
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. -
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 08-05-2024]
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు -
అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
[ 08-05-2024]
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి -
ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు
[ 08-05-2024]
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. -
పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
[ 08-05-2024]
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వలస ఓటరు కలిసొచ్చేనా ..
[ 08-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కర్షకుల కరుణకు నేతల ఆరాటం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. -
వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
[ 08-05-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు -
‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం
[ 08-05-2024]
గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.