అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
శ్రేణుల్లో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి
రేవంత్రెడ్డికి గిరిజన సంప్రదాయ కండువా వేస్తున్న మహిళ
పెద్దశంకరంపేట, నారాయణఖేడ్, న్యూస్టుడే: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి పరిశ్రమలు స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటితో స్థానికంగానే కాకుండా రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి ఇస్తే, ఫార్మా కంపెనీల క్లస్టర్, విలేజ్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అదే విధ]ంగా నియోజకవర్గంలో మహిళా ఐటీఐని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సభావేదికపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రాములునాయక్, ఏనుగు రవీందర్రెడ్డి
అందుబాటులో ఉండే నేతకు పట్టం కట్టాలి
ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే సురేష్షెట్కార్ను ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ ఆయనకు కేటాయిస్తే, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంజీవరెడ్డికి త్యాగం చేశారని కొనియాడారు. సంజీవరెడ్డి అయితేనే విజయం సాధిస్తారని గ్రహించడంతోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో షెట్కార్ ఈ పని చేశారని పేర్కొన్నారు.
సభకు హాజరైన నాయకులు, అభిమానులు, ప్రజలు
సైడ్లైట్స్..
- బహిరంగ సభకు సాయంత్రం 5 గంటల నుంచి కార్యకర్తలు, అభిమానుల రాక మొదలయ్యింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడ్డారు.
- సీఎం పెద్దశంకరంపేటకు సాయంత్రం 6.17 నిమిషాలకు చేరుకోగా హెలిపాడ్ వద్ద మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు ఘనంగా సన్మానించారు. 6.30కి రోడ్షో ప్రారంభించి సభావేదిక వద్దకు రాత్రి 7.05 నిమిషాలకు చేరుకున్నారు. 8 గంటల నుంచి 8.32 వరకు వరకు ప్రసంగించారు.
భారీ జనం చూసి ఉత్సాహం..
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభకు అంచనాలకు మించి కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలు సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.
ఉత్సాహంగా సాగిన రోడ్షో
పెద్దశంకరంపేటలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సీఎం రోడ్షో ఉత్సాహంగా సాగింది. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా ఉత్తులూరు అండర్ బ్రిడ్జి వరకు వచ్చిన సీఎం అనంతరం ఓపెన్టాప్ వాహనంలో సభావేదిక వరకు రోడ్షో నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
హామీలు నెరవేర్చే సత్తా కాంగ్రెస్కే ఉంది
మంత్రి దామోదర్ రాజనర్సింహ
దేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోపే అమలు చేశామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన, మహిళకు 50 శాతం రిజర్వేషన్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు వేతనాలు పెంపు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను కాలరాయడానికే భాజపా 400 సీట్లు కోరుకుంటోందని దుయ్యబట్టారు. జారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో సోనియాగాంధీని ఒప్పించి, మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయించడంతో తన పాత్ర ఉందన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా, మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పట్టించుకోవడంలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
[ 07-05-2024]
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!
[ 07-05-2024]
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. -
గ్యారంటీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
[ 07-05-2024]
హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
హామీల అమలులో మాట తప్పిన సీఎం
[ 07-05-2024]
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. -
అధినేత యాత్రపై ఆశలు
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
[ 07-05-2024]
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. -
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 07-05-2024]
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
అత్యవసరమైతేనే బయటకు రండి
[ 07-05-2024]
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా?
[ 07-05-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. -
రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: రాజాసింగ్
[ 07-05-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. -
భాజపా ఓడితేనే అన్ని వర్గాలకు న్యాయం
[ 07-05-2024]
దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జి
[ 07-05-2024]
హుస్నాబాద్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి, హౌజ్ఫెడ్ మాజీ ఛైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. -
సామాజిక మాధ్యమం.. ప్రచారానికి ఊతం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తుండటంతో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 07-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్ టాక్స్ పేయర్స్’ అంటూ ఉద్యమాలు చేపడతారు. -
కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే
[ 07-05-2024]
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
[ 07-05-2024]
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
దొంగల వెంట పోలీస్ పరుగో పరుగు
[ 07-05-2024]
తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!