గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు
గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని వికాసానికి దోహదం చేస్తాయని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ ఆధ్వర్యంలో ‘సతత్ వికాస్’ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘సతత్ వికాస్’ పురస్కారాల ప్రదానం
ప్రశంసా పత్రాలను, శాలువాలను తిరిగి ఇస్తున్న సర్పంచులు బండి శ్రీనివాస్, ఆలేటి రజిత
న్యూస్టుడే - దుబ్బాక, చేర్యాల, జగదేవపూర్, గజ్వేల్ గ్రామీణ, మద్దూరు, రాయపోల్, ములుగు, దౌల్తాబాద్, మిరుదొడ్డి, రాయపోల్ హుస్నాబాద్ గ్రామీణ: గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని వికాసానికి దోహదం చేస్తాయని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ ఆధ్వర్యంలో ‘సతత్ వికాస్’ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. తొమ్మిది విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలకు సంబంధిత ప్రతినిధులకు పురస్కారాలు అందించి సత్కరించారు. దుబ్బాకలో 13, జగదేవపూర్లో 15, గజ్వేల్ పరిధిలో 16, రాయపోలో మండలంలో 15, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో 27, మిరుదొడ్డిలో 13, దౌల్తాబాద్లో 27 గ్రామ పంచాయతీలతో పాటు చేర్యాల, మద్దూరు, ములుగు, మర్కూక్ తదితర మండలాలకూ అవార్డులు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవోలు, సర్పంచులు, వార్డు సభ్యులు, తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీవోలు, మార్కెట్ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
మద్దూరులో రసాభాస : మద్దూరులో జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రథమ స్థానం దక్కాల్సిన వాటికి రాజకీయ పైరవీలతో ద్వితీయ, తృతీయ స్థానాలకు పరిమితం చేశారని ఆగ్రహిస్తూ తమకు ఇచ్చిన పత్రాలను, శాలువాలను తిరిగి అధికారులకు వాపసు ఇచ్చారు. ప్రశంసా పత్రాలు, సన్మానోత్సవ కార్యక్రమానికి మండలంలోని 23 గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. వల్లంపట్ల, బైరాన్పల్లి, బెక్కల్ గ్రామాల్లో పంచాయతీ, ప్రభుత్వ నిధులతో మిగతా గ్రామాల కంటే అభివృద్ధి చేసినప్పటికీ సెలెక్షన్ కమిటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ గ్రామాలకు ద్వితీయ, తృతీయ స్థానాలు ప్రకటించినట్లు ఆయా గ్రామాల సర్పంచులు ఆలేటి రజిత, బండి శ్రీనివాస్, కూకట్ల బాల్రాజ్ విమర్శించారు. వల్లంపట్ల సర్పంచి భర్త యాదగిరి.. ఎంపీపీని సభలో నిలదీస్తుండగా ఆయనను అర్హత లేదంటూ బయటకు పంపించారు. ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడాలని అధికారులకు ఎంపీపీ సూచించారు.
ములుగులో సర్పంచులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఏఎంసీ ఛైర్మన్ జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!