గడువు ముంగిట పనుల హడావుడి
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు.
పర్యవేక్షణ లేక.. సీసీ రోడ్లలో నాణ్యత కరవు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
నందికందిలో పనులు
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. ఈ లోగా ఎలాగైనా పూర్తి చేయాలని గుత్తేదారులు హడావుడిగా పనులు చేపడుతున్నారు. చాలా చోట్ల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీసీ రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
సగం చోట్ల పూర్తి
జిల్లాలో సంగారెడ్డి, అందోలు సబ్ డివిజన్ల పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఫిబ్రవరి తొలి వారంలో జిల్లా కలెక్టర్ 829 పనులకు.. రూ.70.39 కోట్ల అంచనా నిధులకు ఆమోదం తెలిపారు. పల్లెల్లో సీసీ రహదారులకు రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు మంజూరయ్యాయి. రూ.5 లక్షలలోపు పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ఆపై వాటికి టెండర్లు నిర్వహించారు. ఇప్పటి వరకు 418 సీసీ రోడ్ల పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 399 పనులు ప్రగతిలో ఉన్నాయి.
అందని గతేడాది బిల్లులు
జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా రూ.26.56 కోట్ల విలువైన పనులు చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లులు ఒక్క రూపాయైనా మంజూరు కాలేదు. గతేడాది చేపట్టిన పనుల బిల్లులు రూ.8కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతోనూ గుత్తేదారులు నాణ్యత విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలి. పర్యవేక్షణ అధికారులు లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా రోడ్లు వేస్తున్నారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు సిమెంట్, ఇసుక, కంకర కలపడం లేదనే విమర్శలొస్తున్నాయి. చాలా చోట్ల రాతిపొడిని అధికంగా వినియోగిస్తున్నారు. పనులకు ముందు రోడ్డును రోలర్తో చదునుగా మార్చాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. నీటి తడులు (క్యూరింగ్)నూ విస్మరిస్తున్నారు. ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేయకుంటే నిధులు వెనక్కి వెళతాయనే ఉద్దేశంతో హడావుడిగా చేస్తున్నారనే విమర్శలున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..
- జగదీశ్వర్, పీఆర్ ఈఈ, సంగారెడ్డి
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రహదారుల పనులకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఈ లోగా పూర్తిచేసిన వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తే బిల్లులు వస్తాయి. లేదంటే బిల్లులు రావు. గడువు సమీపించినప్పటికీ కచ్చితంగా పనుల్లో నిబంధనలు పాటించాల్సిందే. ఎక్కడైనా నాణ్యత పాటించకుండే ఫిర్యాదు చేయండి. విచారించి మళ్లీ పనులు చేయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు