మెతుకుసీమలో త్రిముఖ పోరు
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది.
సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు
న్యూస్టుడే-మెదక్: మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. నామినేషన్ల ఉపసంహరణ సోమవారంతో ముగియగా... ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ పోరు మాత్రం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస మధ్యే నెలకొంది. అన్ని పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ప్రచారానికి కేవలం పదకొండు రోజులే మిగిలి ఉండడంతో ప్రత్యేక వ్యూహాలను రచిస్తూ... క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని వేడెక్కించేలా ఆయా పార్టీ శ్రేణులు కదన రంగంలోకి దిగారు. త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం... మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఈసారి పెద్దసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. వీరిలో భారాస నుంచి వెంకట్రామిరెడ్డి, భాజపా నుంచి రఘునందన్రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు. వీరితో పాటు బీఎస్పీ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
పాతికేళ్ల తర్వాత మరో అవకాశం కోసం..
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న భాజపా... మెదక్ స్థానం నుంచి రఘునందన్రావును బరిలో దింపింది. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన రెండోసారి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం...ప్రధాని మోదీ చరిష్మా కలిసిరానుందని భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఒకసారి మాత్రమే భాజపా విజయం సాధించింది. పాతికేళ్ల తర్వాత మరోసారి అవకాశం ఉందని భావిస్తున్న కమలం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంగళవారం జిల్లాకు ప్రధాని మోదీ రానుండటంతో అవకాశాలు మరింత మెరుగుపడుతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
బీసీ మంత్రంతో..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ మేరకు పార్టీ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ కేటాయించింది. పటాన్చెరు మండలం చిట్కూల్ వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన సర్పంచిగా పనిచేసి...ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆతర్వాత కాంగ్రెస్లో చేరి ఎంపీ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం... గ్యారంటీల అమలు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. మంత్రి కొండా సురేఖకు లోక్సభ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మెదక్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలవగా, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక సెగ్మెంట్లలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆపార్టీ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్రెడ్డి ప్రచారం నిర్వహించారు.
సిట్టింగ్ స్థానం నిలుపుకొనేందుకు
2004 నుంచి వరుసగా ఈ స్థానంలో విజయకేతనం ఎగరవేస్తున్న భారత రాష్ట్ర సమితి(భారాస) ఈసారి సైతం సిట్టింగ్ స్థానాన్ని పదిలపర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు విశ్రాంత కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలో దింపారు. 2002 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న ఆయనకు కొంత అవగాహన ఉంది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎక్కువ రోజులు పనిచేయగా, మెదక్ జిల్లాలో కొద్దిరోజుల పాటు ఇన్ఛార్జీ కలెక్టర్గా కొనసాగారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తొలిసారి ప్రత్యక్ష పోరులో తలపడుతున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ ఆరుచోట్ల భారాస ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండడం... మరోవైపు భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయా చోట్ల కొంత కేడర్ చేజారినా... ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉండగా...మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ అభ్యర్థి గెలుపును తన భుజాలపై వేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన మెతుకుసీమ గడ్డపై మరోమారు సత్తాచాటే ప్రయత్నం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.