నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది.
జిల్లా టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు
పత్తి విత్తనాలు...
న్యూస్టుడే, గజ్వేల్: దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. ఈ మేరకు జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆమోదం తెలిపినట్లు జిల్లా డీఏవో శివప్రసాద్ వెల్లడించారు. ఎక్కడైనా బీటీ-3 పత్తి విత్తనాలు, అనుమతి లేని మొక్కజొన్న, ఇతర పంట విత్తనాలు విక్రయించకుండా బృందం నిరంతర నిఘా ఉంటుందని అన్నారు.
రైతులకు అంటగట్టి.. పుడమిని నమ్ముకొని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఈ దందాను సాగిస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్కు ముందే గ్రామాల్లో తిష్ఠ వేస్తున్నారు. హుస్నాబాద్, తూప్రాన్, గజ్వేల్, ములుగు, వర్గల్ ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులను మోసగిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీలోని గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేనివి, నకిలీ పత్తి(బీటీ-3) విత్తనాలను సీజన్కు ముందే తీసుకొచ్చి గ్రామాల్లో నిల్వచేసి వర్షాలు రాగానే అదును చూసి విక్రయిస్తున్నారు. జాతీయ రహదారికి చేరువలో సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఉండటంతో సరుకు రవాణా చేసే వాహనాల్లో విత్తనాలు తీసుకొచ్చి సీజన్ ప్రారంభం కాగానే వివిధ గ్రామాల్లో విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. కలుపు నాశని మందులను తట్టుకునే జన్యుమార్పిడి విత్తనాలైన బీటీ-3 పత్తి విత్తనాలు సాగు చేస్తే శ్రమ తక్కువ అని దళారులు చెప్పటంతో రైతులు ఆశక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో ఈ విత్తన సాగు విస్తరిస్తూ వస్తోంది. గ్లైఫోసెట్(గడ్డి మందు) పిచికారి చేయటం వల్ల పంట ద్వారా పత్తితో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా రైతులు, ప్రజలు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ విత్తనాల సాగును నిషేధించింది. అయినప్పటికీ కలుపు నివారణ చర్యలు సులభం కావటంతోపాటు పత్తి దిగుబడి ఎక్కువగా ఉంటుందని దళారుల ప్రచారంతో రైతులు ఈ విత్తనాలపై ఆసకి చూపుతున్నారు. ప్రస్తుతం సాధారణ బీటీ-2 రకం విత్తన సంచి ధర రూ.864 వరకు ఉంటే బీటీ-3 విత్తనాలు రూ.1500ల వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ నకిలీ, కల్తీ విత్తనాల విక్రయాలను ఆదిలోనే అరికట్టి రైతులకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.
రెండు జిల్లాల్లో సాగు ఇలా..
పది రోజుల్లో రోహిణీ కార్తె రానుంది. వానాకాలం సీజన్ ఆరంభం కానుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో దాదాపు 4.50 లక్షల మంది రైతులున్నారు. రెండు జిల్లాల్లో కలిపి వానాకాలం సీజన్లో సుమారుగా 7.71 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు రైతులు పత్తి విత్తనాలకే రూ.34.56 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. మొక్కజొన్న, వరి తదితర విత్తనాలకు మరో రూ.1.50 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారు. పంట వేసిన తరువాత విత్తులు సరిగా మొలకెత్తకపోవటం, పంట ఏపుగా పెరిగినా పూత, కాత రాకపోవటం తదితర ప్రతికూలతతో నకిలీ విత్తనాలు వెలుగు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందేందుకు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వమే ముందుగా నకిలీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు: శివప్రసాద్, డీఏవో
నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా కఠిన చర్యలు తప్పవు. బీటీ-3 పత్తి విత్తనాలపైనా ప్రత్యేక నిఘా పెట్టాం. పోలీసుల సహకారంతో టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతించారు. ఏర్పాటు చేసి నకిలీలను అరికడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులు తెరిపించేందుకు చర్యలేవీ?
[ 14-06-2024]
ప్రతి పంచాయతీ లేదా ఆవాసంలో ఒక పాఠశాల ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు లేక మూతపడిన అన్ని పాఠశాలలను తెరిపిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
హత్యాయత్నం, అట్రాసిటీ కేసులో భాజపా మాజీ అధ్యక్షుల రిమాండ్
[ 14-06-2024]
భూతగాదాకు సంబంధించి హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట పట్టణ అధ్యక్షులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి గురువారం రిమాండు విధించారు -
రాజీవ్ రహదారి.. లేవా నిబంధనలు!
[ 14-06-2024]
వాహనదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. -
ఎట్టకేలకు పనుల్లో కదలిక
[ 14-06-2024]
జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దున ఉంటాయి. వీరు వివిధ అవసరాలకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు -
జల దోపిడీ
[ 14-06-2024]
పరిశ్రమల నీటి అవసరాలను కొందరు అక్రమార్కులు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ బోర్ల నుంచి తోడేస్తూ.. ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. -
పిడుగుపాటుకు మహిళ మృత్యువాత
[ 14-06-2024]
పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, మరో మహిళ గాయాలపాలైన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. -
వేదం.. అణువణువునా జీవనం
[ 14-06-2024]
వేదాధ్యయనంతో భవితను చక్కదిద్దుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగానికి పూర్తి భిన్నమైన వేదాభ్యసన కోర్సులకు ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలోని వీరశైవ ఆగమ పాఠశాల వేదికగా నిలిచింది. -
రక్తదాత.. స్ఫూర్తి ‘ప్రదాత’
[ 14-06-2024]
రక్తదానం.. ప్రాణదానంతో సమానం. తక్షణం స్పందించే తత్వం.. నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ కుటుంబానికి జీవనజ్యోతిగా మారుతుంది. -
వడగళ్ల వర్షం.. ఇళ్లు ధ్వంసం
[ 14-06-2024]
మండలంలోని లింగోజి గూడ, రూప్లా తండా, కొత్తపేట, రత్నాపూర్ తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. -
ఇంకుడు గుంత.. తీర్చేను నీటి చింత
[ 14-06-2024]
వాన నీటిని సంరంక్షించి, భూగర్భ జలాల పెంపునకు గతంలో ఇంకుడు గుంతలు నిర్మించారు. నిర్వహణ కొరవడి అవి వృథాగా మారాయి -
దారులు ధ్వంసం.. ఒళ్లు హూనం
[ 14-06-2024]
పల్లెల్లో రోడ్లు గుంతలు పడడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇవి మోకాలోతు ఉండడం వల్ల వాహనాలు ధ్వంసమవుతున్నాయి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్