ఇంటి మీద.. అవార్డుల పంట
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో మిద్దెపైన పంటలు పండిస్తున్న వారిలో ఏటా ఒకరిద్దరు పురస్కారాలు సాధిస్తున్నారు. ఈ సారి ముగ్గురు ఉగాది పురస్కారాలు పొందారు. రసాయనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లపై కూరగాయల సాగుపై చాలా మంది శ్రద్ధ కనబరుస్తున్నారు. పురపాలిక అధికారులు కూడా రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సాగు చేపట్టేవారు రూ.1500 చెల్లిస్తే రూ.10 వేల విలువైన సంచులు, విత్తనాలు, ఎరువులు, రసాయనాలు అందిస్తున్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ చాలామంది మిద్దె సాగుకు చేపడుతున్నారు. సూర్యాపేట పట్టణంలో ఇప్పటి వరకు సుమారు 1060 మంది తమ ఇళ్లపైన ప్రత్యేకంగా ఇనుప పందిళ్లు ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడ చేపట్టే తోటలను వివిధ పరిశోధన సంస్థలు ఏటా పరిశీలించి పురస్కారాలు అందిస్తున్నాయి. ఈసారి ఆదిగురు భారత సంఘం, గోఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యాన శాఖ సమక్షంలో అందించే ఉగాది పురస్కారాలకు సూర్యాపేటకు చెందిన నల్లపాటి మమత, వందనపు శ్రీదేవి, నాతాల మన్మథరెడ్డి ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 10న హైదరాబాద్లోని ఉద్యాన కళాశాలలో ఉగాది పురస్కారాలు అందించి సన్మానించారు.
ఆనందంగా ఉంది - నాతాల మన్మథరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సూర్యాపేట
ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో మిద్దెపైన కూరగాయలు పండిస్తున్నాం. కాకర, బీర, బెండ, చిక్కుడు, సొర, వంగ, టమాట, పచ్చిమిర్చి, దొండ, దోస, బుడందోస, తదితర కూరగాయలు సాగుచేస్తున్నాం. తోటకూర, బచ్చలి, తెల్లగలిజేరు, గంగవావిలి ఆకుఊకర, పుదీన ఆకుకూరలతోపాటు అంజీర, డ్రాగన్ ప్రూట్, ఫాల్సా, బార్బడ్, చెర్రీస్ పండ్ల మొక్కలు పెంచుతున్నాం. ఉగాది పురస్కారం పొందినందుకు ఆనందంగా ఉంది. ఈ పురస్కారం నాతోపాటు మరికొంతమంది సాగు చేసేలా ప్రోత్సాహాన్నిస్తుంది.
బాధ్యత పెరుగుతోంది
- నల్లపాటి మమత, సూర్యాపేట
ఐదేళ్ల నుంచి మిద్దెపైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. సొంతంగా ఎరువు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నా. ఇప్పటి వరకు రైతునేస్తం, ఆదిగురు భారత సంఘం, గోఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ వారు పురస్కారాలు దక్కాయి. మిద్దెసాగు బాగుందని గడ్డిపల్లి కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం) వారు మహిళా దినోత్సవం రోజు సన్మానించి జ్ఞాపిక అందించారు. మిద్దెసాగు మొట్టమొదట చేపట్టడంతో 2020లో పుర అధికారులు గుర్తించి సన్మానించారు. మిద్దె సాగు వల్ల ఆరోగ్యం, ఆనందంతోపాటు శారీరకంగా వ్యాయామం కలుగుతోంది. పురస్కారాలు రావడం వల్ల మరింత బాధ్యత పెరుగుతోంది. భవిష్యత్తులో తల్లిదండ్రులు ‘టెర్రస్ గార్డెన్’ను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలి.
ఆరేళ్లుగా సాగు చేస్తున్నాం
- వందనపు శ్రీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకరణ, నల్గొండ
ఆరేళ్లుగా మిద్దెతోట సాగు చేస్తున్నాను. ఇంట్లో పండించిన కూరగాయలనే 90 శాతం తింటున్నాం. పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాను. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నాం. దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. రసాయనాలు లేని పంట వల్ల ఆరోగ్యం బాగుంటోంది. ఇంట్లోని కూరగాయలు, పండ్ల వ్యర్థాలు కూడా తిరిగి ఎరువుగా మార్చుకుంటున్నాం. ఉగాది పురస్కారం రావడంతో మిద్దెతోటపై మరింత శ్రద్ధ పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652