logo

భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి

Published : 19 Apr 2024 06:15 IST

 శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణ నిర్వహిస్తున్న పూజారులు
యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. పాలతో నిజాభిషేకం నిర్వహించాక, తులసీపత్రాలతో అర్చన చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణ మూర్తులకు స్వర్ణ పుష్పార్చన జరిపారు. మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన క్రతువులను కొనసాగించారు. ఉగ్ర నరహరిని శాంతింప చేసేందుకు శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణం ఆలయ ఆచారంగా చేపట్టారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలను ఊరేగించారు. రాత్రి గర్భాలయంలోని స్వయంభువులను కొలుస్తూ ప్రత్యేక ఆరాధన జరిపారు. ఆదాయం రూ.13,89,412 సమకూరిందని ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

వసంత నవరాత్రోత్సవంలో భాగంగా గురువారం శ్రీసీతారామచంద్రస్వామి వార్లకు పట్టాభిషేక మహోత్సవ క్రతువు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ వేడుక కనుల పండువగా జరిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని