icon icon icon
icon icon icon

Uttam Kumar Reddy: భారాసకు ఒక్క స్థానం రావడమూ కష్టమే: మంత్రి ఉత్తమ్‌

మతాన్ని అడ్డుపెట్టుకుని భాజపా విద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Updated : 02 May 2024 15:50 IST

సూర్యాపేట: మతాన్ని అడ్డుపెట్టుకుని భాజపా విద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలో ఆ పార్టీ మరోసారి అవకాశమిస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయన్నారు. మోతెలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాసకు ఒక్క లోక్‌సభ స్థానం రావడం కూడా కష్టమేనని చెప్పారు. ఈ సమావేశంలో నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img