లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి: చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి దీప్తి హోటల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.
భువనగిరి: భువనగిరి దీప్తి హోటల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజులలోపే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. రానున్న రోజులలో కాంగ్రెస్.. ఆర్యవైశ్యులకు పెద్దపీఠ వేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు భారాస ప్రభుత్వం ఆర్యవైశ్యులను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంత పాలనను ప్రజలు తరిమి కొట్టారన్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ పాలనను తరిమికొట్టాలని కోరారు. ఈ నెల 13 న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అమర వాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, సీనియర్ నాయకుడు, పీసీసీ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, బాలలక్ష్మి పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గస్థాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు