అన్విత మరో సాహసం
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది.
దెనాలి పర్వతారోహణకు పయనం
అన్విత
భువనగిరి గ్రామీణం, న్యూస్టుడే: ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లి గ్రామానికి చెందిన అన్విత శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరి 20న ఉదయం అలాస్కా విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తన గైడ్ సహాయంతో పర్వతం వద్దకు చేరుకుంటుంది. పర్వతం రూట్ని పరిశీలిస్తారు. వాతావరణ అనుకూలతను బట్టి పర్వతారోహణ ప్రారంభిస్తారు. జూన్ 4 నుంచి 10 లోపుగా పూర్తి చేయాలనేది లక్ష్యం. గత పర్వతాలు అధిరోహిస్తున్న సమయంలో సామగ్రి మోసుకెళ్లేందుకు పొటెన్(సహాయకుడు)ఉండేవారు. ప్రస్తుతం స్వయంగా 70 కిలోల బరువును భుజాన వేసుకొని ఎత్తైన శిఖరం అధిరోహించాలి.
ప్రస్థానం ఇలా..
అర్జున్ అవార్డు గ్రహీత పర్వతారోహకుడు శేఖర్బాబు నేతృత్వంలో భువనగిరి ఖిల్లా పక్కన స్థాపించిన రాక్ క్లైంబింగ్ స్కూల్ ద్వారా 2014లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పర్వతారోహణపై శిక్షణ ఇచ్చారు. అదే సంవత్సరంలో ఈయన శిష్యరికంలో శిక్షణ పొందిన పూర్ణ, ఆనంద్లు అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులుగా రికార్డు సాధించారు. అదే సమయంలో వార్తాపత్రికల్లో పర్వతారోహకుల కథనాలు చూసి ప్రేరణ కలిగి తల్లిదండ్రులకు చెప్పకుండా శేఖర్బాబును కలిసి తన అభిలాషను తెలిపింది. అతను తల్లిదండ్రులను పిలిచి ఒప్పించి శిష్యురాలిగా చేర్చుకున్నారు. అదే సంవత్సరంలో బేసిక్ కోర్సు, 2019లో అడ్వాన్స్ కోచింగ్ తీసుకున్నారు. పర్వతారోహణకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం, మెలకువలు తెలుసుకున్నారు. ఇలా సాగిన ఆమె ప్రస్థానం ఆమె లక్ష్యాన్ని చేరుకునేందుకు చేరువలో నిలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండల కార్యాలయాల సందర్శన
[ 13-06-2024]
జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే బొమ్మల రామారం, బీబీనగర్ తహశీలుదారు కార్యాలయాలను గురువారం సందర్శించారు. -
బడి పండగ మొదలాయె
[ 13-06-2024]
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇన్నాళ్లు సెలవుల్లో సేదదీరిన విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యాసంస్థలను తోరణాలు, గాలిబుడగలు, రంగురంగుల కాగితాలతో అలంకరించారు. -
ఢీ సీసీబీ
[ 13-06-2024]
ల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్డీసీసీబీ) అవిశ్వాసం అంశం ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాసలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
అనుమతులు మరచి...హద్దులు దాటించి
[ 13-06-2024]
పశుసంపదను పల్లెల నుంచి నిత్యం వందల సంఖ్యలో అక్రమంగా సరిహద్దులు దాటించి వధశాలలకు తరలిస్తున్నారు. పశువుల సంఖ్య తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడుతుంది. -
వృద్ధురాలిపై లైంగిక దాడి
[ 13-06-2024]
వృద్ధురాలిపై బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం నల్గొండ జిల్లా చందంపేటలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఈసారి భూసార పరీక్షలు లేనట్లే..!
[ 13-06-2024]
భూమి ఆరోగ్యం కాపాడటానికి, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు చేపట్టిన భూసార పరీక్షలు ఈ ఏడాది సైతం జరిగేట్లు లేవు. -
నేలకేసి కొట్టి చిన్నారి దారుణ హత్య
[ 13-06-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ చిన్నారిని హత్య చేసిన ఘటన చివ్వెంల మండలంలోని అయిలాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
యోగా శిక్షణ.. తప్పని నిరీక్షణ
[ 13-06-2024]
ప్రస్తుతం నిత్యం ఉరుకులు, పరుగుల జీవితం. భార్యాభర్త ఇరువురూ పనిచేస్తేగానీ కుటుంబం గడవని రోజులివీ. ఈ తరుణంలో మానసిక ప్రశాంతత కొరవడి చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. -
శుభ్రత కనుమురుగు.. తప్పదు ముప్పు
[ 13-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో నాలాలు, వరద, మురుగుకాల్వలు అధ్వానంగా మారాయి. వ్యర్థాలు పేరుకుపోయి దిగువకు నీరు పారడం లేదు. -
జారిపడతారు.. జర జాగ్రత్త..!
[ 13-06-2024]
వేగంగా వెళ్తే అంతే..: చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో మూడేళ్ల క్రితం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వర్షానికి నీళ్లు నిలిచాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సిమెంట్ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్
-
ఇటలీకి పయనమైన ప్రధాని మోదీ.. మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ రాక మరింత ఆలస్యం
-
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం.. నటుడికి గాయం
-
వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: ఏపీ మంత్రి నిమ్మల