logo

ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు

మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు.

Published : 19 Apr 2024 03:45 IST

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. చెమిడిదిపాడు సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఇందులో ఉన్న పి.సుబ్బమ్మ, పొట్టెమ్మకు తీవ్రగాయాలు కాగా, కె.కుమారి, పి.రాములమ్మ, యూవీ రమణమ్మ, ·కె.జాలమ్మ, వి.జయలక్ష్మి, కె.మంగమ్మ, పి.గోవిందమ్మ, ఎన్‌.సుబ్బరత్తమ్మ, ఎ.జయమ్మ, ఎ.రమణమ్మ, వి.వనమ్మకు స్వల్పగాయాలయ్యాయి. గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు 108 వాహనాల్లో క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలించారు. సుబ్బమ్మ,పొట్టెమ్మను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. గుడ్లూరు పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ భాస్కరరావు కేసు విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని