పట్నం నుంచి పల్లెదాకా..
జిల్లాలో గంజాయి ఘాటెక్కుతోంది. నగరం, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. యువత విచ్చలవిడిలా వినియోగిస్తూ మత్తులో నిండా మునుగుతోంది.
విచ్చలవిడిగా గంజాయి వినియోగం
కేసులకు నెరవని విక్రయదారులు
న్యూస్టుడే, నిజామాబాద్ నేరవిభాగం
జిల్లాలో గంజాయి ఘాటెక్కుతోంది. నగరం, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. యువత విచ్చలవిడిలా వినియోగిస్తూ మత్తులో నిండా మునుగుతోంది. సిరులు కురిపిస్తున్న ఈ దందాలో అనేక మంది భాగస్వాములవుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో రూ.లక్షల విలువ చేసే సరకు పట్టుబడి, కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ విక్రేతలు వెనక్కి తగ్గడం లేదు.
ఆరు నెలల్లో 30 కేజీలు
గంజాయిని ఎక్కువగా ఒడిశా, గోవా, మహారాష్ట్రల నుంచి రైలు, బస్సు మార్గాల ద్వారా జిల్లాకు తీసుకొస్తున్నారు. గత ఆరు నెలలుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో 30 కిలోల వరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న 17.2 కిలోలు పట్టుబడింది. పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ గత రెండు నెలల్లో అయిదు కేసులు నమోదు చేశారు. గతనెల ఒకటో ఠాణా పరిధిలో పది కిలోల వరకు సరకు పట్టుకుని, నాందేడ్ నుంచి సరఫరా చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో నాలుగో ఠాణా పరిధిలోని అమ్మ వెంచర్లో విక్రయదారులను పట్టుకున్నారు.
యువతే లక్ష్యంగా..
ఎక్కువగా యువతనే లక్ష్యంగా చేసుకుని గంజాయి దందా నడుస్తోంది. నగరంలోని రద్దీ ప్రాంతాలను అమ్మకాలకు అనువుగా మార్చుకుంటున్నారు. చిన్నచిన్న పొట్లాలు చేసి కళాశాలల్లో విక్రయిస్తున్నట్లు పలు ఠాణాల్లో కొందరిపై కేసులు నమోదై ఉన్నాయి.
సరఫరాపై ఉక్కుపాదం
జిల్లాలో గంజాయి సరఫరాపై నిఘా పెంచాం. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే మార్గాలని గుర్తించి పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు మా సీఐలు స్వప్న, మధుసూదనరావులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా విక్రయిస్తున్నారని తెలిస్తే పోలీసులకు లేదా మాకు సమాచారం ఇవ్వాలి.
కిషన్, ఏసీ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెరపైకి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
[ 17-05-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. -
కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
[ 17-05-2024]
జిల్లాలో వరి కోతలు మొదలై నెలరోజులైనా కొనుగోళ్లు పూర్తికావడం లేదు. హమాలీలు, సంచుల కొరత లేనప్పటికీ లారీలు లేక రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణకు రైసుమిల్లర్లు ససేమిరా అంటున్నారు. -
ఎత్తుకు పై ఎత్తులు
[ 17-05-2024]
ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాసకు చెందిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. -
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
[ 17-05-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
తక్కువ చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సులు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పెరిగిన వినియోగం.. తగ్గిన లబ్ధిదారులు
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్కార్డు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసి శూన్య బిల్లులు అందజేస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. -
వేసవి శిక్షణ.. లక్ష్యసాధన
[ 17-05-2024]
వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ చిన్నారులు తమలోని అంతర్గత ప్రతిభకు పదును పెడుతున్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ.. తమకు ఇష్టమైన రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్నారు. -
విభిన్న కోర్సుల ప్రత్యేకం
[ 17-05-2024]
ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. 158 ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది. -
మొబైల్ ‘దోస్త్’తో సులభం
[ 17-05-2024]
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇదివరకే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మొబైల్లో దోస్త్ ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. -
సెర్చ్ కమిటీ ఏర్పాటు
[ 17-05-2024]
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నూతన ఉపకులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్
[ 17-05-2024]
అనుమతి లేని లేఅవుట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయటాన్ని కట్టడి చేయటంపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా రూపొందిన దస్తావేజుల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
చరవాణి కోసం.. రైలు నుంచి దూకి
[ 17-05-2024]
ప్రాణం కంటే చరవాణి విలువైనది అనుకున్నాడేమో ఆ యువకుడు రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ కిందపడిపోవడంతో ఒక్కసారిగా దూకి తీవ్రగాయాలపాలయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!