బడుల బలోపేతానికి కృషి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు
అమ్మ ఆదర్శ కమిటీలతో అభివృద్ధి పనులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు. లోపల కూరలు, బయట అన్నం వండుతున్నారు. బడి ఆవరణలోనే వంట గది నిర్మించారు. కానీ, పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రారంభానికి నోచుకోలేదు.
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం: జిల్లా వ్యాప్తంగా అనేక బడుల్లో ఇలాంటి సమస్యలు తిష్ఠ వేశాయి. వీటికి వేసవి సెలవుల్లోనే మోక్షం కలిగించేందుకు ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ కమిటీలను నియమించింది. ఫలితంగా పాఠశాలల్లో 2024- 25 విద్యా సంవత్సరంలో అనేక సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది వరకు ఉన్న యాజమాన్య కమిటీల స్థానంలో కొత్తగా కమిటీలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించనున్నారు.
యూడైస్ ప్రక్రియ ఆధారంగా..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల బడుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అధికారులు యూడైస్ ప్రక్రియ ద్వారా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. మన ఊరు మన బడి కింద ఎంపికైన బడుల్లో పనులు నామమాత్రమే పూర్తయ్యాయి. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా బడుల్లో తాగునీటి సమస్యలకు మరమ్మతులు, తరగతి గదుల్లో విద్యుత్తు సంబంధిత పనులు, బాలికలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సమస్యలు తీర్చనున్నారు. ఇప్పటికే కమిటీలకు సంబంధించిన నియామకాలు పూర్తయ్యాయి. పనులు పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు పూర్తి చేయనున్నారు. మన ఊరు మన బడి పథకం కింద ఎంపికై అపరిష్కృతంగా ఉన్న పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రత్యేక బృందాల పరిశీలన
- రాజు, డీఈవో-కామారెడ్డి
సర్కారు బడుల్లో నియమించిన అమ్మ ఆదర్శ కమిటీల ఆధారంగా పనులు జరుగుతాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బడుల్లో సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపాం. సమస్య తీవ్రంగా ఉన్న బడులను గుర్తించి వెంటనే పనులు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిగిలింది పది రోజులే..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 02-05-2024]
నిత్యం ప్రజల్లో ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 2,19,784 మంది
[ 02-05-2024]
గడిచిన ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఓటు నమోదుకు అధికారులు చేస్తున్న ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు సార్లు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. -
మెజార్టీ పోటీ
[ 02-05-2024]
లోక్సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉన్నందున ఇంటింటి ప్రచారం సాధ్యంకాని పరిస్థితి. దీంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులపైనే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తెచ్చే బాధ్యతను మోపాయి. -
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఆచార్య కోదండరాం
[ 02-05-2024]
స్వలాభం కోసం కొందరు మతం పేరిట ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం- బహిరంగ చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘కాంగ్రెస్ వాగ్దానాలతో మోసపోయిన అన్నివర్గాలు’
[ 02-05-2024]
మోసపూరిత కాంగ్రెస్, భాజపాలను పార్లమెంటు ఎన్నికల్లో పాతర పెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
రక్తం కొరత.. రోగులకు వెత
[ 02-05-2024]
‘జిల్లాకేంద్రానికి చెందిన గర్భిణి భవానికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించింది. అందులో ఆ రక్త విభాగానికి సంబంధించి ఒకే యూనిట్ నిల్వ ఉంది. -
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ చేపట్టన అభివృద్ధి పనులు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం జనంలోకి వచ్చే అటవీ జంతువులు.. ప్రస్తుతం అటవీ అధికారులు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలతో వనంలోనే దాహం తీర్చుకుంటున్నాయి. -
సాహస దీపిక
[ 02-05-2024]
విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని.. సాహస క్రీడల్లో పాల్గొంటే జాతీయస్థాయిలో సత్తాచాటవచ్చని నిరూపించారు గిరిరాజ్ కళాశాలకు చెందిన దీపిక. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
[ 02-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. అప్రమత్తతతోనే ఆపదలను నివారించవచ్చు అంటున్నారు అధికారులు. మే 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతిభ
[ 02-05-2024]
హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు’లు అనే అంశంలో నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్). -
73 ఏళ్లుగా పోలింగ్ కేంద్రం
[ 02-05-2024]
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆంగ్లేయులను పారదోలిన మహాత్మా గాంధీ పేరుతో జిల్లా కేంద్రంలో వెలసిన బాపూజీ వచనాలయం పాఠకులకు విజ్ఞాన నేస్తంగా నిలుస్తోంది. ఈ పఠనాలయాన్ని 1951లో ఏర్పాటు చేశారు. -
అభ్యర్థుల తరఫున అన్నీ తామై..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల, జిల్లాస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. -
లోక్సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది
[ 02-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలు భాజపా, భారాస, కాంగ్రెస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది