logo

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

రామారెడ్డి భారాస గ్రామ మాజీ యువజన అధ్యక్షుడు బండి ప్రవీణ్.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Published : 05 May 2024 19:42 IST

రామారెడ్డి: రామారెడ్డి భారాస గ్రామ మాజీ యువజన అధ్యక్షుడు బండి ప్రవీణ్.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మా గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, సొసైటీ వైస్ ఛైర్మన్ పశుపతి శేఖర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని