‘కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం’
ఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మనూరు మండలం తిమ్మాపూర్కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచి నర్సింహులు ముదిరాజ్, శంకర్నాయక్ తండాకు చెందిన మాజీ సర్పంచి కిషన్నాయక్తో పాటు పలువురు హస్తం గూటికి చేరారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్
నారాయణఖేడ్, న్యూస్టుడే: ఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మనూరు మండలం తిమ్మాపూర్కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచి నర్సింహులు ముదిరాజ్, శంకర్నాయక్ తండాకు చెందిన మాజీ సర్పంచి కిషన్నాయక్తో పాటు పలువురు హస్తం గూటికి చేరారు. వారికి షెట్కార్ కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ బార్ అసోసియేషన్కు చెందిన పలువురు సభ్యులు ఖేడ్లోని సురేష్ షెట్కార్ నివాసానికి వచ్చి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యమన్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు