logo

‘పథకాలే భాజపాను గెలిపిస్తాయి’

జహీరాబాద్‌ పార్లమెంట్‌లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో భాజపా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

Published : 06 May 2024 04:29 IST

మాట్లాడుతున్న ఎంపీ బీబీ పాటిల్‌

మాచారెడ్డి, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ పార్లమెంట్‌లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో భాజపా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలే మరోసారి భాజపాను అధికారంలోకి తెస్తాయని అన్నారు. తాను చేసిన వాగ్దానాలను ఎన్నికల అనంతరం నెరవేరుస్తానని పేర్కొన్నారు. భాజపాకు ఓటు వేసి భారీ మెజారిటీని ఇవ్వాలని కోరారు. భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి గ్రామాలు, తండాలను అభివృద్ధి చేస్తానన్నారు. గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాలకు చెందిన పలువురు భాజపాలో చేరారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి, మండలాధ్యక్షుడు సురేశ్‌, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, కుమ్మరి రాజశేఖర్‌, గోపి గంగారం, హారిక, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని