logo

‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’

‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రజలను కోరారు.

Updated : 08 May 2024 06:48 IST

పెగడాపల్లిలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
బోధన్‌ గ్రామీణం, సాలూర, న్యూస్‌టుడే : ‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి పెగడాపల్లి, సాలూరలో నిర్వహించిన కార్నర్‌ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. భారాస, భాజపాలు యువకుల భవిష్యత్తు నాశనం చేశాయని ఆరోపించారు. అర్వింద్‌ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. బోధన్‌ చక్కెర పరిశ్రమ తెరిపించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ పెట్టుబడి, ఇంధన ధరలు పెంచి వారి నడ్డివిరిచారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వరికి క్వింటా ధర రూ.3 వేలకు పెంచుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.500 బోనస్‌ ఇస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకు ప్రధాని మోదీ కారణమని విమర్శించారు. పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌, నాయకులు గంగాశంకర్‌, గౌసోద్దీన్‌, నాగేశ్వర్‌రావు, రాజిరెడ్డి, రవి, అశోక్‌, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిలో 21వ ప్యాకేజీ పనులు: జక్రాన్‌పల్లి: సాగునీటిని అందించే 21వ ప్యాకేజీ పనులను ఎంపీగా ఎన్నికైన ఏడాదిలో పూర్తిచేయిస్తానని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మగళవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇండియా కూటమి ప్రభుత్వంలో గుత్ప అదనపు ఎత్తిపోతలు, పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సాయారెడ్డి, చిన్నారెడ్డి, అనంత్‌రెడ్డి, నర్సారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని