logo

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Published : 25 Apr 2024 17:42 IST

సిమిలిగుడ: ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అందులో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. కొత్తవలస - ఖీరందుల్ ( కే కే రైలు మార్గం) లో ఖీరందుల్ నుంచి ఇనుప ఖనిజం పదార్థాలతో విశాఖపట్నానికి గూడ్స్ రైలు కొరాపుట్ - అరుకు మార్గంలో వెళ్తుంది. ఈక్రమంలో పాడువా వద్ద బోల్తా పడింది. దాంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మార్గంలో కొన్ని రైళ్లను రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు