నవీన్జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర
రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.
మాట్లాడుతున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. గురువారం రాత్రి సంబల్పూర్లో ఏర్పాటైన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సీఎంను నిశితంగా విమర్శించారు. ప్రజలకు మంచినీరు, వ్యవసాయరంగానికి సాగునీరు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన నవీన్ పరాయి వారికి పాలన అప్పగించి నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. పశ్చిమ ఒడిశాలో ప్రధాన నగరమైన సంబల్పూర్కు ఏం చేశారని నిలదీశారు. ఆదాయ వనరులు, కేంద్రం సమకూరుస్తున్న నిధులు పుష్కలంగా ఉన్నా, ప్రగతి రథచక్రాలు పరుగులు తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులూ లేవన్నారు. బిజద పాలకులకు 25 ఏళ్లు అవకాశమిచ్చిన ప్రజలు రానున్న అయిదేళ్లు భాజపాకు పాలనాపగ్గాలివ్వాలని, డబుల్ ఇంజిన్ పాలనకు ఓట్లేయాలని పిలుపునిచ్చారు. సంబల్పూర్ అభివృద్ధే ధ్యేయంగా తనను గెలిపించాలని ఓటర్లకు ధర్మేంద్ర కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెట్టీ కల సాకారమవుతుందా..?
[ 17-06-2024]
జెట్టీ నిర్మాణం గోపాలపూర్ మత్స్యకారుల కల, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. సాకరం కాలేదు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడం, -
మరణాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు?
[ 17-06-2024]
జిల్లాలోని కాశీపూర్ సమితి మునుస్పొదర్ గ్రామంలో ఐదుగురు చిన్నారులు మృతికి కారణమైన అంతుచిక్కని వ్యాధి ఏంటన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. -
ద్వారాలు తెరిచారు.. ఇబ్బందులు తొలగలేదు..
[ 17-06-2024]
భాజపా ప్రభుత్వం ఏర్పడిన 12 గంటల్లో పూరీ శ్రీక్షేత్రం నాలుగు ద్వారాలు తెరిపించింది. 13న ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి ఆయన మంత్రివర్గ సహచరులంతా పూరీ వచ్చి.. స్వయంగా తలుపులు తెరిచారు. -
ప్రాణం తీసిన పాతకక్షలు
[ 17-06-2024]
పాత కక్షల నేపథ్యంలో బావ తన బావమరిదిని నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన గజపతి జిల్లాలో చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు.. -
శామలేశ్వరికి ధర్మేంద్ర పూజలు
[ 17-06-2024]
కేంద్రమంత్రిగా మూడోసారి అవకాశం దక్కించుకున్న ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం సంబల్పూర్ వచ్చారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శామలేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. -
మాజీ గవర్నర్ మురళీధర్ కన్నుమూత
[ 17-06-2024]
రాష్ట్ర మాజీ గవర్నరు మురళీధర్ చంద్రకాంత్ భండారి (95) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబయిలో తుదిశ్వాస విడిచారు. 2007 నుంచి 2013 వరకు రాష్ట్రానికి భండారి విశిష్ట సేవలందించారు. -
నేను బతికే ఉన్నా.. పింఛను ఇవ్వండి
[ 17-06-2024]
బతికి ఉన్న వ్యక్తి మృతి చెందాడని మూడు నెలలుగా పింఛను నిలిపివేసిన ఘటన నందపూర్ సమితిలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. -
‘మిషన్శక్తి’ పేరు మార్పు?
[ 17-06-2024]
నవీన్ పాలనలో అమలు చేసిన ‘మిషన్శక్తి’ కార్యక్రమం పేరు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్యక్రమాలు
తాజా వార్తలు (Latest News)
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
-
బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు
-
నేడు చంద్రబాబు పోలవరం సందర్శన