గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
గ్రామాల్లో కేంద్ర బలగాల కవాతు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు అదనంగా ఇరవై కంపెనీల సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్)ను మోహరిస్తారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారి ధొళో అధ్యక్షతన సమావేశమైన కమిటీ గంజాం జిల్లాలో అదనపు కేంద్ర బలగాల మోహరింపునకు ఆమోదం తెలిపింది. రిజర్వు ఫోర్స్ లేదా స్ట్రైకింగ్ ఫోర్స్ కింద వివిధ పోలింగు బూత్ల వద్ద వారిని నియమిస్తారు. ఈమేరకు ప్రధాన ఎన్నికల అధికారి ధొళో గంజాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు ఆదేశాలు జారీ చేశారు. కళ్లికోట ఠాణా పరిధిలోని శ్రీకృష్ణశరణపూర్ గ్రామంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార బ్యానర్లు కట్టే విషయమై భాజపా-బిజద మద్దతుదారులు, కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు జరిగిన సంగతి తెలిసిందే. భాజపా కార్యకర్త ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడడంతో గురువారం కళ్లికోట ఠాణా వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే. దీంతో జిల్లాలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పార్టీల నేతలు, కార్యకర్తలు శాంతియుతంగా మెలగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా సంయమనం పాటించాలని సూచించారు.
గురువారం శ్రీకృష్ణ శరణపూర్ గ్రామంలో జరిగిన హింస నేపథ్యంలో కళ్లికోట ఠాణా వద్ద గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెట్టీ కల సాకారమవుతుందా..?
[ 17-06-2024]
జెట్టీ నిర్మాణం గోపాలపూర్ మత్స్యకారుల కల, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. సాకరం కాలేదు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడం, -
మరణాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు?
[ 17-06-2024]
జిల్లాలోని కాశీపూర్ సమితి మునుస్పొదర్ గ్రామంలో ఐదుగురు చిన్నారులు మృతికి కారణమైన అంతుచిక్కని వ్యాధి ఏంటన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. -
ద్వారాలు తెరిచారు.. ఇబ్బందులు తొలగలేదు..
[ 17-06-2024]
భాజపా ప్రభుత్వం ఏర్పడిన 12 గంటల్లో పూరీ శ్రీక్షేత్రం నాలుగు ద్వారాలు తెరిపించింది. 13న ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి ఆయన మంత్రివర్గ సహచరులంతా పూరీ వచ్చి.. స్వయంగా తలుపులు తెరిచారు. -
ప్రాణం తీసిన పాతకక్షలు
[ 17-06-2024]
పాత కక్షల నేపథ్యంలో బావ తన బావమరిదిని నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన గజపతి జిల్లాలో చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు.. -
శామలేశ్వరికి ధర్మేంద్ర పూజలు
[ 17-06-2024]
కేంద్రమంత్రిగా మూడోసారి అవకాశం దక్కించుకున్న ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం సంబల్పూర్ వచ్చారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శామలేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. -
మాజీ గవర్నర్ మురళీధర్ కన్నుమూత
[ 17-06-2024]
రాష్ట్ర మాజీ గవర్నరు మురళీధర్ చంద్రకాంత్ భండారి (95) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబయిలో తుదిశ్వాస విడిచారు. 2007 నుంచి 2013 వరకు రాష్ట్రానికి భండారి విశిష్ట సేవలందించారు. -
నేను బతికే ఉన్నా.. పింఛను ఇవ్వండి
[ 17-06-2024]
బతికి ఉన్న వ్యక్తి మృతి చెందాడని మూడు నెలలుగా పింఛను నిలిపివేసిన ఘటన నందపూర్ సమితిలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. -
‘మిషన్శక్తి’ పేరు మార్పు?
[ 17-06-2024]
నవీన్ పాలనలో అమలు చేసిన ‘మిషన్శక్తి’ కార్యక్రమం పేరు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్యక్రమాలు
తాజా వార్తలు (Latest News)
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి
-
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!