జీతం రాక.. జీవనం సాగక
ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అయినా కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో కార్పొరేషన్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో సెలవు పెట్టినా సగం జీతం అందేది.
ఆర్టీసీ కార్మికులకు తప్పని అవస్థలు
ఆర్టీసీ డీఎం భాస్కర్రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
సాలూరు, న్యూస్టుడే: ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అయినా కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో కార్పొరేషన్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో సెలవు పెట్టినా సగం జీతం అందేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సాలూరు డిపో పరిధిలోని పలువురు పక్షవాతం, గుండె, కిడ్నీ, వెన్నెముక సంబంధిత వ్యాధులకు గురై మంచాన పడ్డారు. వీరికి నెలలుగా జీతాల చెల్లింపులు జరగక పోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. డిపోలో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులు ఈ మేరకు సోమవారం ప్రబంధకుడు భాస్కర్రెడ్డికి వినతిపత్రం అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆదుకోవాలని విన్నవించారు. దీనిపై డీఎం మాట్లాడుతూ ప్రస్తుతం ఖజానా ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని, తమ పరిధిలో లేదన్నారు. సిక్ లీవ్లో ఉన్నవారికి సకాలంలో సగం వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మూడు నెలలుగా ఇవ్వలేదు..
మంచం పట్టిన ఈ కార్మికుడి పేరు వి.శ్రీనివాసరావు. పక్షవాతంతో బాధపడుతూ ఆరు నెలలుగా సెలవులో ఉన్నారు. గత మూడు మాసాలుగా నెలనెలా అందాల్సిన సగం జీతం రావడం లేదు. దీంతో ఇంట్లో సరకులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెలవు పెట్టినా హాజరు వేయాలట?
నేను రెండు నెలలుగా అనారోగ్య కారణాలతో ఇంటి వద్దే ఉన్నాను. గతంలో సిక్ లీవ్లు పెడితే సగం జీతం వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సెలవు పెడితే హాజరు వేయాలని డిమాండు చేస్తున్నారు. చాలామంది లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారెలా హాజరు
జి.త్రినాథ, బస్సు చోదకుడు, సాలూరు డిపో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్కసుడక్కడ.. ఇసుకాసురులిక్కడ!!
[ 02-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక తోడేళ్లు నదులపై పడ్డాయి.. ఈ ఐదేళ్లూ వాటిని గుల్ల చేసేశాయి.. నిత్యం టన్నుల మేర తవ్వేస్తూ తరలించుకుపోయాయి.. రూ.కోట్లలో లాభాలు ఆర్జించాయి.. -
నీ జమానాలో అక్కాచెల్లెమ్మలు బక్కచిక్కారు
[ 02-05-2024]
మైకు కనిపిస్తే చాలు... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎక్కడా లేని బంధుత్వాలు.. ఆప్యాయతలు.. తెగపుట్టుకొస్తాయి. ఏ వేదికపై మాట్లాడినా అక్కాచెల్లెమ్మలు.. నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. గిరిజనులు, మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామంటూ మాటలతో ఊదరగొట్టేస్తారు. -
నేడు పాలకొండలో వారాహి యాత్ర
[ 02-05-2024]
పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. -
వీరిని చూస్తుంటే బాధని‘పింఛన్’
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. -
మన్యంలో ‘దారి’ద్య్రమిది..
[ 02-05-2024]
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు చెబుతున్నా మన్యంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఐదేళ్లలో గిరిశిఖర గ్రామాల రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో దారులు అధ్వానంగా మారాయి. -
అంతా ఓకేనా.. ఓ సెల్ఫీ తీసుకుందాం
[ 02-05-2024]
సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు. -
నీకు తప్ప.. రైతుకు ఏదీ భరోసా
[ 02-05-2024]
‘ఈ కేంద్రాల నుంచే వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి. -
ఒకటి పోయె.. రెండు వచ్చె
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల నగదు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉందని, పరిశీలించాలని పండుటాకులు మొరపెట్టుకున్నా చెవికెక్కించుకోలేదు. -
జగన్ రాజ్యంలో.. ఇసుక దందా
[ 02-05-2024]
జగన్ రాజ్యంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు రేవుల నుంచి విశాఖ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురానికి రోజూ వందల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. -
పాలకా... విస్తరణ మరిచారా!
[ 02-05-2024]
‘పాలకొండ ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నాం.. పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇరువైపులా పెద్ద కాలువలను నగర పంచాయతీ నిధులతో నిర్మించనున్నాం..’ అంటూ మూడేళ్ల క్రితం పాలకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. -
నేడు వెంకంపేటలో నితిన్ గడ్కరీ సభ
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరకు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిని కొత్తపల్లి గీత తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ గురువారం పార్వతీపురం వస్తున్నారు.