‘మిథ్యా’లయం!
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది.
జేఎన్టీయూలో వెంటాడుతున్న బోధకుల కొరత
కాకినాడ విద్యాలయం నుంచే కొందరికి జీతాలు
సమస్యల పరిష్కారానికి విద్యార్థుల ఆందోళన (పాతచిత్రం)
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. 2022లో కాకినాడ నుంచి విడిపోయి యూనివర్శిటీ హోదా దక్కించుకున్నా అభివృద్ధి లేదు. బోధÅకులూ కరవయ్యారు. సమస్యలపై విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కినా ఫలితం లేదు. దీంతో ప్రవేశాలు తగ్గుతున్నాయి.
న్యూస్టుడే, విజయనగరం విద్యావిభాగం
విధులిక్కడ.. జీతాలక్కడ...
ఇంజినీరింగ్ కళాశాలగా ఉన్న సమయంలో బోధన 41, బోధనేతర సిబ్బంది ఆరుగురు రెగ్యులర్గా నియమితులయ్యారు. వీరిలో 21 మంది ఫ్యాకల్టీ, ఆరుగురు బోధనేతర సిబ్బంది డిప్యుటేషన్పై నర్సరావుపేట, కాకినాడ విద్యాలయానికి వెళ్లారు. మరికొందరు ఐచ్ఛికం ఇచ్చి కాకినాడకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బోధిస్తున్న 22 మందిలో 17 మంది ఇక్కడివారే. మిగిలినవారిని బోధనకు ఇబ్బంది లేకుండా ఇక్కడ కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచే వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన 51, గంటల ప్రాతిపదికన అయిదుగురు మొత్తం 56 మంది బోధకులుగా పనిచేస్తున్నారు.
ఇద్దరే సహాయకులు
బోధనేతర సిబ్బందిలో ఉప రిజిస్ట్రార్, సహాయ రిజిస్ట్రార్, ఇద్దరు సీనియర్ సహాయకులు నలుగురిని డిప్యుటేషన్పై తిప్పుతున్నారు. ఇటీవలే ఉప రిజిస్ట్రార్(డీఆర్)ని వెనక్కి రావాలని ఆదేశించారు. ఏఆర్ మెడికల్ లీవులో ఉన్నారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లతోనే నడుస్తోంది. కాకినాడ విశ్వవిద్యాలయమే వీరికి జీతాలు చెల్లిస్తోంది. పది వరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నా, భర్తీ కాలేదు.
విభాగాల్లో రక్షణ సిబ్బంది
పొరుగు సేవల కింద నియామకాలకు ఓ కమిటీ లేదు. రోస్టర్ పాటించలేదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు నియమితులైనవారే. 2007లో పొరుగుసేవల కింద తీసుకున్న 56 మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం 2019 తర్వాత ఎవరినీ తీసుకోకూడదని ఉత్తర్వులిచ్చింది. అయినా అవసరం మేరకు కొందరిని నియమించారు. వీరు కాకుండా టెండర్పై సెక్యూరిటీ 60, హౌస్ కీపింగ్లో 60 మందిని తీసుకున్నారు.
ప్రవేశాలకు విముఖత
ఇంజినీరింగ్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇక్కడ ప్రవేశాలకు విముఖత చూపుతున్నారు. 2023-24లో ప్రవేశాల్లో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ మినహా మిగిలిన కోర్సుల్లో 10 వేలలోపు ర్యాంకుల వారు లేరు. ఎక్కువ డిమాండ్ ఉన్న సీఎస్ఈలో ఓపెన్ కేటగిరీ పురుషుల విభాగంలో మూడువేలలోపు ర్యాంకుల వారు లేరు. 10,546 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. బీసీ-డిలో అయిదువేల ర్యాంకు దాటినవారే ప్రవేశాలు పొందారు. ఈసీఈ ఓపెన్లో ఏడువేలు, బీసీడీలో 10వేలు దాటిన అభ్యర్థుల నుంచి సీట్ల కేటాయింపు ప్రారంభమైంది. మెటలర్జీ ఓపెన్ కేటగిరీలో మహిళలకు 1,98,861 ర్యాంకుకూ సీటు లభించింది. బీసీ-డి కేటగిరీలో 1,41,492 ర్యాంకుకు సీటు కేటాయించారు. ఈఈఈలో పురుషులు ఓపెన్లో 29వేల ర్యాంకు, బీసీడీలో 17వేల ర్యాంకు పైబడిన వారికీ సీట్లు లభించాయి. మెకానికల్లో ఓపెన్లో పురుషులు 49వేలు ర్యాంకు, బీసీ-డిలో 24,118 ర్యాంకు పైబడిన వారికి, సివిల్లో 60వేల ర్యాంకుల వారు ప్రవేశాలు పొందారంటే పరిస్థితి అర్థమవుతోంది.
వసతికి వెతలు
- వసతిగృహాల్లో సమస్యలపై విద్యార్థులు గత నవంబరు 8న ప్రవేశద్వారం వద్ద బైఠాయించారు. నాలుగేళ్ల కిందటా ఇలాగే నిరసన తెలిపారు. జేఎన్టీయూలో నాలుగు వసతిగృహాల్లో సుమారు వెయ్యి మంది ఉంటున్నారు. 29 సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ ఇవ్వాలని డిమాండు చేశారు. ఇటీవలే వారిలో 11 మందిని వసతి గృహాల నుంచి సస్పెండ్ చేశారు. ఒక విద్యార్థికి పాము కరవడం, పలుమార్లు కొందరు అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
- జాతీయ రహదారి-26 నుంచి విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వరకు రోడ్డు విస్తరణ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. వీసీ బంగ్లా, ఆడిటోరియం, వాటర్ట్యాంకు, పరీక్షల విభాగం నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. కురుపాం కళాశాలకు రూ.30కోట్లు, పరిపాలనా విభాగానికి రూ.12కోట్లు, ఆడిటోరియానికి రూ.8కోట్లు, ఇతరత్రా పనులకు రూ.20కోట్లు నిధులిచ్చినా పనులు జరగలేదు.
- తొలిసారిగా 2022-23లో విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, పాతవి మళ్లీ ఇవ్వడం, ధ్రువపత్రాల జారీలో అపవాదునేసుకుంది. ఉత్తీర్ణులకు సీఎంఎం (కన్సాలిడేషన్ మార్క్స్ మెమో), బదిలీ పత్రాలివ్వడంలో జాప్యం జరిగింది. విద్యార్థులు యూజీసీ, ఏఐసీటీయూకి ఫిర్యాదులు చేశారు. రీవేల్యూషన్, అడ్వాన్స్డ్సప్లిమెంటరీ నిర్వహణ, ఛాలెంజింగ్ వేల్యూషన్ సక్రమంగా అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రతిబంధకాలివే..
- నాక్ గుర్తింపు లేకపోవడం.
- ఎన్బీఏ గుర్తింపు ఏడు బ్రాంచుల్లో ఐటీ, ఈఈఈ, సివిల్, మెటలర్జీ నాలుగు బ్రాంచులే ఉంది.
- ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్లో యూనివర్సిటీ చోటు దక్కించుకోకపోవడం.
- ప్రాంగణ నియామకాలు అంతంతమాత్రమే.
వీసీ ఏమన్నారంటే..
ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పెరగడం.. డబ్బులు కట్టేవారంతా డీమ్డ్ విశ్వవిద్యాలయాలపై మొగ్గుచూపడంతో ఇక్కడకు మంచి ర్యాంకర్లు రాలేదు. విద్యాలయం నాక్, ఎన్బీఏ గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బోధనకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకుంటాం.
కె.వెంకట సుబ్బయ్య, ఉప కులపతి, జేఎన్టీయూ గురజాడ విద్యాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు
[ 13-06-2024]
తొలకరి వర్షాలు కురవనందున ఖరీఫ్ రైతన్నలు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. -
ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు
[ 13-06-2024]
మండలంలోని గళావల్లి గ్రామంలోని తామరచెరువులో 60 సెంట్ల భూమిని ఆక్రమణ చేసేందుకు ప్రయత్నం చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. -
పులకింత.. కేరింత
[ 13-06-2024]
తెదేపా కూటమి మళ్లీ అధికారంలోకి రావడం.. రాష్ట్రంలో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరడం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కల్యాణ్, లోకేశ్ సహా పాతిక మంది ప్రమాణ స్వీకారం చేసిన వేళ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. -
బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
[ 13-06-2024]
జిల్లాలో 81 పాఠశాల, కళాశాలల బస్సులు ఉన్నాయని జిల్లా రవాణా అధికారి శశికుమార్ చెప్పారు. బుధవారం ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 60 బస్సులను మాత్రమే తనిఖీలకు తీసుకొచ్చి ఫిట్నెస్ ధ్రువపత్రాలు తీసుకున్నారన్నారు. -
గిరిజనులకు వైద్య సేవలపై ఆరా
[ 13-06-2024]
పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర వైద్యుల బృందం సందర్శించింది. గిరిజన ప్రాంతాల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై దిల్లీ ఎన్హెచ్ఎస్ఆర్సీ నుంచి వచ్చిన డాక్టర్ బాలమోలీ, డాక్టర్ హిమికా కౌండల్ ఆరా తీశారు. -
స్త్రీనిధి రుణాల లక్ష్యం రూ.55 కోట్లు
[ 13-06-2024]
జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రుణాలు రూ.55కోట్లు మంజూరు చేయాలన్నది లక్ష్యమని ఏజీఎం హేమలత తెలిపారు. బుధవారం పాచిపెంట వెలుగు కార్యాలయంలో ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. -
సంధ్యారాణి శ్రీనివాస్ అనే నేను..
[ 13-06-2024]
అవును.. పార్టీ జెండా మోసిన వారికి ఎప్పుడూ గుర్తింపు దక్కుతుంది. నిజమే.. తెలుగుదేశం పార్టీ విధేయతకు పట్టం కడుతుంది.. మరోసారి రుజువైంది.. ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్కు మంత్రి పదవులు దక్కాయి. -
గజపతినగరానికి రెండోసారి అవకాశం
[ 13-06-2024]
గజపతినగరం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇద్దరు మంత్రి పదవులను పొందారు. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, విజయం సాధించిన కొండపల్లి శ్రీనివాస్ బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
బాలల భద్రతతో దేశ ప్రగతి
[ 13-06-2024]
బాల కార్మికులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా ముందుకు రావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు కోరారు. -
ఎన్నికల ధ్రువపత్రాలు జారీ చేయాలి
[ 13-06-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి సంబంధిత ధువ్రపత్రాలు జారీ చేయాలని ఏపీటీఎఫ్- 1938 నాయకులు ఎన్.వి.పైడిరాజు, పి.బాబూలాల్ డి.ఈశ్వరరావు, సి.హెచ్.పైడితల్లి కోరారు. -
వసతి గృహాల్లో పిచికారీ పూర్తి: డీఎంవో
[ 13-06-2024]
పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో వసతి గృహాల్లో దోమల నివారణ మందు పిచికారీ పూర్తిచేసినట్లు జిల్లా మలేరియా నివారణాధికారి జగన్మోహనరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
21 మందికి నోటీసులు
[ 13-06-2024]
మండలం లోని గునుపూరుపేటలో ఆనందరాజు చెరువును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దారు జె.రామారావు తెలిపారు. రిజిస్ట్రేషన్ విషయమై ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆర్డీవోను ఆదేశించారు. -
కొత్త కొలువుల లోకం!!
[ 13-06-2024]
ఐటీఐ కోర్సుల్లో ఓజేటీ(ఆన్జాబ్ ట్రైనింగ్) విధానాన్ని ఈ విద్యా సంవత్సరంలో పక్కాగా ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత అధికారులు దృష్టిసారించారు. విద్యార్థులు చదువుతూనే పరిశ్రమల్లో పనిచేయడం దీని ప్రధాన ఉద్దేశం. -
చంద్రబాబు పాలనలో అభివృద్ధి పరుగులు: ఎంపీ
[ 13-06-2024]
అయిదు కోట్ల ఆంధ్రుల కల నెరవేరిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్లో బుధవారం జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. -
వయోవృద్ధులకు బీసీజీ టీకాలు తప్పనిసరి
[ 13-06-2024]
వయోజనులంతా బీసీజీ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నగరంలోని తన కార్యాలయంలో టీకాలకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. -
యూకే ఆసుపత్రిలో ఉద్యోగానికి ఎంపిక
[ 13-06-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్లో బీఎస్సీ కార్డియాలజీ పూర్తి చేసిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నిస్సీ లియోన్ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన అత్యున్నత ఆసుపత్రిలో ఉద్యోగానికి ఎంపికైనట్లు జెమ్స్ వైద్య కళాశాల చీఫ్ మెంటార్ డా.బొల్లినేని భాస్కరరావు తెలిపారు. -
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. నవ్యాంధ్ర సారథికి మది మదినా నీరాజనాలు.. ప్రతి ఆంధ్రుడు ఎదురుచూసిన మధుర క్షణాలు... ప్రతి మోమున వికసించిన ఆనంద బాష్పాలు... తెలుగు నేలపై స్వేచ్ఛ ఊపిరిలూదిన తరుణం.. శరవేగంతో ప్రగతి పరిఢవిల్లాలనే సంకల్పం... నవ్యాంధ్రకు ఆత్మీయ చంద్రోదయం.. నవ చరితకు అపూర్వ మహోదయం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ పోస్టర్లో మా నాన్నను చూస్తే భయమేసింది: వరుణ్ తేజ్
-
షకీబ్ అల్ హసన్ హాఫ్ సెంచరీ.. నెదర్లాండ్స్ లక్ష్యం 160
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
-
రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి